కొత్తవారని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్య నేతలతో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవలేదన్నారు. తాను అధ్యయనం చేసి ఈ విషయం చెబుతున్నానని అన్నారు. పార్టీలోకి కొత్తవారు రాకూడదనే ఆలోచన ధోరణిని మానుకోవాలని వపన్ కల్యాణ్ నేతలను కోరారు. ఎవరైనా టిక్కెట్ల కోసం డబ్బులిస్తే తనకు సంబంధం లేదని ఆయన తెలిపారు.
ముందస్తు ఎన్నికలు…
తనతో పాటు పార్టీకి అండగా నిలబడే నాయకులు వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. బీజేపీ నేతలపై కేసులు పెట్టి వారిని కొడితే తాను ఖండించానని, కానీ జనసేన కార్యకర్తలను కొడితే మాత్రం బీజేపీ రాష్ట్ర నేతలు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా చేస్తానంటే తనకు అభ్యంతరం లేదని, వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన ఉంటుందని తెలిపారు. తాను సర్వేలు చేయించిన తర్వాతనే టిక్కెట్లు ఖరారు చేస్తానని తెలిపారు.