నిన్న జరిగిన పుంగనూరు సంఘటన దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీసులను ఆయన పరామర్శించారు. ఈ సంఘటన బాధాకరమన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసులు త్వరగా కోలుకునేలలా అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఓటమి ఖాయమయిందని…
చంద్రబాబుకు పిచ్చి పట్టి వ్యవహరిస్తున్నారని అన్నారు. కుప్పంలో తన ఓటమి ఖాయమయిందని తెలిసి ఘర్షణలు తలెత్తేలా పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్న పెద్దిరెడ్డి అందుకే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
పరామర్శ…
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంట జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్,ఎస్.పి రిషాంత్ రెడ్డి, చిత్తూరు,పూతలపట్టు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఎం.ఎస్.బాబు, చిత్తూరు నగర మేయర్ అముద,చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి,డిప్యూటీ మేయర్ రాజేష్, కుమార్ రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ప్రభావతి డి సి హెచ్ ఎస్ డాక్టర్ నాయక్ మెడికల్ సూపరిం టెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, అపోలో ఇంఛార్జి నరేష్ కుమార్ రెడ్డి కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.