మణిపూర్ లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దేశమంతా మణిపూర్ ఘటనపై అట్టుడికి పోతున్నా అక్కడ మాత్రం హింస ఆగడం లేదు. తాజాగా రాత్రి బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. మృతులంతా క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందిన వారుగా గుర్తించారు. దీంతో ఆగ్రహించిన మెయిటీ తెగకు చెందిన వారు కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.
ఇప్పటి వరకూ…
మెయిటీ ప్రాతాల నుంచి బఫర్ జోన్ను దాటుకుని వచ్చిన కొందరు వ్యక్తులు కుకీ తెగకు చెందిన ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర బలగాలు పహారా కాస్తున్నా వరుస ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇదే జిల్లాలో రెండు రోజుల క్రితం మెయిటీ తెగకు చెందిన ప్రజలకు, సాయుధ బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో పదిహేడు మంది వరకూ గాయపడ్డారు. మూడు నెలలుగా మణిపూర్ జరుగుతున్న హింసాకాండలో ఇప్పటి వరకూ 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.