పుంగనూరు ఘటనపై ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. పుంగనూరు, తంబళ్లపల్లిలలో జరిగిన దాడులకు సంబంధించి టీడీపీ బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. నిన్నటి దాడులకు సంబంధించిన వీడియోలను కూడా గవర్నర్ కు అందించారు.
రాష్ట్రపతి పాలనకు…
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించాయని, ప్రతిపక్షాలను నియోజకవర్గాల్లో పర్యటించకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని, చంద్రబాబు, లోకేష్ పర్యటనలను కూడా ఆటంకం కల్గిస్తున్నారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు నిన్నటి పుంగనూరు దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తల ఫొటోలను గవర్నర్కు అందచేశారు. శాంతి భ్రదతలు క్షీణించడంతో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.