కరోనా ముప్పు తొలిగిపోయిందనుకుంటున్న తరుణంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగు లోకి వచ్చింది. మరోసారి కరోనా వైరస్ ప్రబలే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అమెరికా, ఇంగ్లండ్లలో కరోనా కేసులు పెరుగుుతన్నాయని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తెలిపింది. దీంతో మరోసారి భారత్ కూడా కరోనా వైరస్ పట్ల అలర్ట్ కావాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు కూడా అభిప్రాయపడుతుననారు. కరోనా కేసులు ఈ రెండు దేశాల్లో విపరీతంగా పెరిగిపోయాయని, ఆసుపత్రిల్లో చేరే వారి సంఖ్య కూడా అధికంగానే ఉందని తెలిపింది.
జాగ్రత్తలు పాటించకుంటే…
ఇంగ్లండ్లో మాత్రం కోవిడ్ కొత్త వేరియంట్ ఉందని తెలిపింది. ఈజీ.5.1 కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ 5.1 అనే కొత్త వేరియంట్ కేసులు బ్రిటన్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. గత జులై నెలలోనే వీటిని గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు ఈ కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ వేరియంట్లోనూ జ్వరం, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడకం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.