ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతారు. ఉయదం 11 గంటలకు గద్దర్ పార్ధీవదేహాన్ని ఆల్వాల్లోని ఆయన ఇంటికి తీసుకు వెళతారు. అక్కడి నుంచి ఆయన అంతియ యాత్ర కొనసాగుతుందని సన్నిహితులు తెలిపారు. ఆయనతో అనుబంధానని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని విలపిస్తున్నారు.
ఆయన స్కూలులో…
నిన్న అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన గద్దర్ పార్ధీవ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఎల్.బి. స్టేడియంలో ఉంచారు. ఉదయం 11 గంటల వరకూ అక్కడే ఉంచుతారు. అక్కడి నుంచి ఆల్వాల్లోని ఆయన ఇంటికి తీసుకెళతారు. మధ్యలో గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు ఉంచుతారరని ఆయన అభిమానులు చెప్పారు. ఆయన ఏర్పాటు చేసిన స్కూల్ మహాబోధి విద్యాలయం లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో ఆయన అభిమానులు తరలివస్తున్నారు. ఎల్.బి. స్టేడియంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పలువురు సంతాపం…
కాగా గద్దర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ప్రజల కోసం చేసిన సేవలను వారు ప్రశంసించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎల్.బి. స్టేడియం వద్దకు వచ్చి గద్దర్ భౌతిక కాయానికి నివాళుర్పించారు. ఎల్. బి. స్టేడియం వద్దకు నిన్న రాత్రి నుంచే గద్దర్ ను చివరి సారి చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో జనాలు వస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గద్దర్ భౌతిక కాయంపై దండలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపానని ప్రకటించారు.