బంగారం అంటే అంతే మరి. ఒక్కసారిగా ధరలు పెరుగుతాయి. మరొక్క సారి తగ్గుతాయి. తగ్గితే తక్కువగా… పెరిగితే భారీగా పెరగడం బంగారానికి అలవాటు. ఎందుకో మరి.. బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా వ్యాపారులకు మాత్రం లాభమే. కానీ నష్టపోయేది మాత్రం ప్రజలే. పేద, సామాన్య ప్రజలకు బంగారం భారంగా మారడంతో కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. అయినా రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని భావించి కొందరు ముందుగానే కొనుగోలు చేస్తున్నారు.
స్కీమ్లతో…
బంగారం అంత మొత్తం పెట్టి కొనుగోలు చేయలేని వారికి జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు అనేక స్కీంలు ప్రకటిస్తూ ఊరిస్తున్నాయి. పాత బంగారాన్ని మార్చడమే కాదు.. కొత్త బంగారం కొనుగోలు చేయాలంటే ఈఎంఐలు ల ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశాయి. అంతే కాదు పాత బంగారంపై గ్రాముపై డిస్కౌంట్లు కూడా ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బంగారం అంటే మక్కువ చేసే వారందరూ ఈ ఆఫర్లకు పడిపోయి కొనుగోలు చేస్తారన్నది వారి నమ్మకం.
స్థిరంగా…
తాజాగా దేశంలో బంగారం ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా ఈరోజు నిలకడగానే ఉండటం విశేషం. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,950 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,160 రూపాయలుగా నమోదయింది. వెండి ధర కిలో 75,100 రూపాయలు పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.