ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు నేడు రాజ్యసభ ఆమోదం కోసం రానుంది. ఇప్పటికే లోక్సభోలో ఆమోదం పొందిన బిల్లు నేడు రాజ్యసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి రెండు ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారనున్నాయి. తెలుగు రాష్ట్రానికి చెందిన వైసీపీ, ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ మద్దతిస్తే బిల్లు ఆమోదం పొందడం సులువుగా మారుతుంది. ఇప్పటికే వైసీపీ, బీజేడీలు లోక్సభలోనూ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు మద్దతు పలికాయి.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు…
ఈ సందర్భంగా రాజ్యసభలోనూ వాడి వేడి చర్చ జరగనుంది. రాష్ట్రాల అధికారాలను హరించివేస్తూ తీసుకొస్తున్న ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించాలంటూ ఇప్పటికే విపక్ష కూటమి “ఇండియా” పిలుపు నిచ్చింది. కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. ప్రతి ఒక్కరూ విధిగా సభకు హాజరు కావాలని ఆదేశించాయి. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ సయితం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించింది. సభ్యులంతా ఈరోజు సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.
రెండు పార్టీల మద్దతుతోనే…
రాజ్యసభలో మొత్త 243 మంది సభ్యులుండగా ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం సభ్యుల సంఖ్య 238గా ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 123గా ఉంది. ఇందులో ఎన్డీఏకు వంద స్థానాలు, విపక్ష కూటమి “ఇండియా”కు 101 స్థానాలున్నాయి. కానీ వైసీపీకి తొమ్మిది, బిజూ జనతాదళ్కు తొమ్మిది స్థానాలున్నాయి. వీరి మద్దతుతో బిల్లును రాజ్యసభలోనూ గట్టెక్కించాలన్న ప్రయత్నంలో అధికార పార్టీ ఉంది. ఈ సందర్భంగా క్రాస్ ఓటింగ్ జరగడంపైనే విపక్ష కూటమి ఆశలు పెట్టుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.