పొరుగు రాష్ట్రమైన పాకిస్థాన్ భారత్ రహస్యాలను కాజేయడానికి అనేక మార్గాలను అన్వేషిస్తుంది. అందులో హనీ ట్రాప్ ఒకటి. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత దీని ద్వారా పాకిస్థాన్ కు చెందిన యువతులు కొందరు కీలకమైన వ్యక్తులను ట్రాప్లోకి లాగుతున్నారు. గతంలో డీఆర్డీవో నుంచి సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వరకూ వదలడం లేదు. అందరినీ ట్రాప్ లోకి లాగి భారత్ రహస్యాలను లాగేందుకు కొందరు పాకిస్థానీయులు చేస్తునన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
పాకిస్థానీ యువతితో…
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పాకిస్థాన్ యువతి విసిరిన హనీ ట్రాప్ లో పడ్డారు. పాక్కు చెందిన యువతి తమీషాతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పరచుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ అనేక విషయాలను ఆమెకు చేరవేసినట్లు గుర్తించారు. 2002 నుంచి కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తమీషాకు కపిల్ కుమార్ కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించిని అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.