ప్రజాగాయకుడు గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ స్పందించింది. గద్దర్ మృతి బాధాకరమని వెల్లడించింది. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేసింది. నిన్న గద్దర్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గద్దర్ అంతిమయాత్రకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
షోకాజ్ నోటీసును…
అయితే గద్దర్ 2012 వరకూ మావోయిస్టు పార్టీలోనే ఉన్నాడని పేర్కొంది. ఆయన చేత ప్రజానాట్యమండలిని ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీ ప్రజల్లో చైతన్యం తెప్పించగలిగిందని పేర్కొంది. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలతో గద్దర్ మమేకం కావడంతో ఆయనకు మావోయిస్టు పార్టీ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసిందని తెలిపింది. దీంతో గద్దర్ 2012లో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొంది. ఆయన పార్లమెంటు పద్ధతుల్లోనే పీడిత ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి అటువైపు వెళ్లారని పేర్కొంది. గద్దర్ మృతి చెందడం బాధాకరమని పేర్కొంది.