గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? బంగారు ఆభరణాలను ధరించడమంటే సామాన్యుల నుంచి ధనికుల వరకూ దానిని ఒక గౌరవంగా భావిస్తారు. బంగారం ఉంటే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని భావిస్తుండటంతోనే గోల్డ్కు గిరాకీ పెరిగింది. స్టేటస్ సింబల్గా గోల్డ్ మారడంతోనే దాని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎంతగా అంటే ఎవరూ కొనలేనంతగా. కొందరికే బంగారం పరిమితమయిపోతుందన్న ఆందోళన ఇటీవల కాలంలో వ్యక్తమవుతూనే ఉంది.
ధరలు పెరగడానికి…
బంగారం ధరలు అంతలా పెరిగి పోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. డిమాండ్కు తగినట్లు బంగారం నిల్వలు లేకపోవడం, బంగారం పెట్టుబడిగా భావించడం వల్లనే దాని ధర అమాంతం పెరిగిందనే వారు కూడా లేకపోలేదు. రానున్న రోజుల్లో 22 గ్రాముల బంగారం అరవై వేలుకు చేరుకుంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు జ్యుయలరీ షాపులు కిటకిటలాడిపోతుంటాయి. భారతీయ సంస్కృతి ప్రకారం పెళ్లి వేడుకలో బంగారం ఒక వస్తువుగా మారడంతో దానిని తప్పక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
నిలకడగానే…
అయితే పసిడి ప్రియులకు గత మూడు రోజులుగా వరసగా గుడ్ న్యూస్ దొరుకుతూనే ఉంది. మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరగకపోవడమే ఇందుకు కారణం. మూడు రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,160 రూపాయల వద్ద నమోదయి ఉంది. ఇక కిలో వెండి ధరపై స్వల్పంగా వంద రూపాయలు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి ధర 75,000 రూపాయలుగా ఉంది.