జమ్ము కాశ్మీర్లో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. రిక్టర్ స్కేల్ మీద తీవ్రత 3.7 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. మంగళవారం తెల్లవారు జామున 12.04 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయకంపితులై ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినట్లు చెబుతున్నారు.
రిక్టర్ స్కేల్పై…
భదేర్వా, కిష్వార్, ఉధంపూర్, ధోడా పరిసర ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. ఇక్కడ స్వల్ప భూకంపమే సంభవించడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కేవలం కొద్ది సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూమి ఉపరితలానికి ఐదు కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు కోరారు.