సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎర్రకోటపై ఆగస్టు 15వ తేదీ సందర్భంగా ఆయన జెండా ఎగురు వేసిన తర్వాత ప్రజలనుద్దేశించి ప్రస్తంగించారు. వరసగా పదోసారి ఎర్రకోటపై మోదీ జెండాను ఎగుర వేశారు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ దేశంలో జరిగే పలు పరిణామాలను గురించి తన ప్రసంగంలో వివరింాచరు. మణిపూర్లో త్వరలోనే శాంతి ఏర్పడతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మణిపూర్ వెంటనే దేశం ఉందన్న మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశం భారత్ మాత్రమేనని మోదీ అన్నారు.
దేశం సురక్షితంగా…
ప్రస్తుతం దేశం సురక్షితంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మహిళ పైలట్లున్న దేశం భారత్ మాత్రమేనని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. దేశంలో ఎప్పటికైనా శక్తిమంతమైన ప్రభుత్వం ఉండాలని మోదీ ఆకాంక్షించారు. అప్పుడే సంస్కరణలు చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేశారని, వారి త్యాగాలను వృధా పోనివ్వ కూడదని అన్నారు. న్యూ ఇండియా అన్స్టాపబుల్ అని ప్రధాని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ నేడు అభివృద్ధి కనిపిస్తుందన్నారు. అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరగాలని మోదీ పిలుపునిచ్చారు.
2047 నాటికి …
అవినీతి రాక్షసి మన దేశాన్ని ఎన్నో ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిందన్న మోదీ అవినీతి భూతం అనేక ఏళ్లు భారత్ ను అభివృద్ధిలో వెనక్కు నెట్టేసిందన్నారు. భారత్ ను ప్రపంచంలోనే మూడో శక్తిమంతమైన దేశంగా మారుస్తామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. 2047 నాటికి భారత్ ను ప్రనంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను తమ ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఐదేళ్లలో 12.5 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయట పడేశామన్న దేశంలో వరస బాంబు పేలుళ్ల సంస్కృతికి తెరపడిందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ మహిళల పాత్ర పెరగాలన్నారు.
సుస్థిర ప్రభుత్వంతోనే…
ప్రపంచ దేశాలన్నీ భారత్ ను మిత్రుడిగానే చూస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణంతో సతమవుతున్న తరుణంలో మనం కోలుకుంటుండటం శుభపరిణామని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల పేరిట అనేక అభివృద్ధి పథకాలను చేపట్టామని తెలిపారు. సబ్బిడీల ద్వారా పది కోట్ల దోపిడీని ఆపగలిగామన్నారు. బినామీలను బయటకు తేగలిగామని చెప్పారు. సైన్యానికి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం 70 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసించారన్నారు. భారతీయ పేదలు మెరుగ్గా మధ్యతరగతి స్థిితికి చేరుకున్నారన్నారు. వందోస్వాతంత్ర్య దినోత్సవానికి అభివృద్ధి భారత్ ను అందిస్తామని మోదీ ఈ సందర్భంగా దేశ ప్రజలకు మాట ఇచ్చారు. భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని ఆయన ఈ సందర్భంగా అన్నారు.