పసిడిప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతుండటం చాలా వరకూ ఊరట కల్గించే అంశమే. పసిడి ధరలు తగ్గితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. కొనలేకపోయినా వినటానికి సొంపుగా ఉండే మాట పసిడి ధరలు తగ్గడం. అది చెవిన పడితే చాలు మగువలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. బంగారం అంటే భారత్లో అంతటి మక్కువ. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువ.
జ్యుయలరీ పట్ల…
అనేక దేశాల్లో గోల్డ్ బాండ్స్ను పెట్టుబడిగా చూస్తూ కొనుగోలు చేస్తుంటే మన దేశంలో మాత్రం జ్యుయలరీనే ఎక్కువగా ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇది వ్యాపారులకు వరంగా మారింది. అయితే అనేక కారణాల వల్ల అంతర్జాతీయంగా, దేశీయంగా తీసుకున్న కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. బంగారం ఇక సామాన్య ప్రజలకు అందనంత దూరంలో వెళ్లిపోతుందన్న ఆందోళన కూడా అధికమవుతున్న తరుణంలో గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతుండటం శుభపరిణామమే.
సెంటిమెంట్గా…
బంగారం ధరలు ఎప్పుడూ మార్కెట్ ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ధరలు పెరిగినా భారతీయ సంస్కృతిలో భాగంగా దానిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వివాహవేడుకలు, శుభకార్యాలకు పసిడి వినియోగం ఎక్కువగా ఉండటం, స్టేటస్ సింబల్ గా మారడంతో పాటు సెంటిమెంట్ కూడా జత కావడంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే దేశీయంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగానే జరుగుతుంటాయి.
వెండి మాత్రం…
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మహిళలకు బంగారం ధరలు తగ్గిందన్న శుభవార్త అందింది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,650 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,620 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధరపై 3,400 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్్లో కిలో వెండి ధర 76,200 రూపాయలుగా నమోదయింది.