తెలంగాణ ముఖ్యమంత్రి CM కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. గౌరవ వందనం స్వీకరించారు. అనంతరంఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడారు. అయితే తన ప్రసంగంలో గవర్నర్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వంలో విలీనం చేయాలని తాము భావిస్తే దానికి అడుగడుగునా కొందరు అడ్డుకున్నారని పరోక్షంగా రాజ్భవన్పై విమర్శలు గుప్పించారు. అయినా కార్మికుల సంక్షేమమే థ్యేయంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తమ సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిందని తెలిపారు. విజయవంతంగా ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగలిగామని కేసీఆర్ చెప్పారు.
అనుసరించడమే…
తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని కేసీఆర్ తెలిపసారు. ఇప్పటి వరకూ 37 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామన్న కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలను తెచ్చామన్నారు. 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామన్న ఆయన రైతుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి కానుక కింద వెయ్యి కోట్లు ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా ముందుకు తీసుకెళుతుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నారన్నారు అని ముఖ్యమంత్రి CM కేసీఆర్.
డబుల్ బెడ్రూం ఇళ్లు… CM
నేటి నుంచే హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని నిరుపేదలు ఒక్క రూపాయి వెచ్చించకుండా డబుల్ బెడ్ రూం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్న కేసీఆర్ నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో గూడులేని ప్రతి ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్ రూం ఇల్లు దక్కేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు. అలాగే సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మానవీయ కోణంలో మూడు లక్షలరూపాయలు ఆర్థిక సాయాన్ని అంద చేస్తుందన్నారు. గృహలక్ష్మి పథకం కింద దీనిని అమలు చేస్తున్నామని, ఇందులో మూడు వేల మంది లబ్ది పొందుతారని చెప్పారు. ఈ పథకంలో ఐదు శాతం దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించామని తెలిపారు.
నీటి పారుదల రంగంలో…
నీటి పారుదల రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్న కేసీఆర్ ఏ రంగాన్ని ఈ తొమ్మిదేళ్లలో విస్మరించకపోవడం వల్లనే ఇంతటి ప్రగతి సాధ్యమయిందన్నారు. అయితే స్వాతంత్ర్యం సిద్ధించి 76 ఏళ్లు గడుస్తున్నా అనుకున్న లక్ష్యాలను చేరకపోవడంపై ఆయన ఆవేదన చెందారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోలేకపోవడం పాలకుల అసమర్థత కారణమన్న కేసీఆర్ అన్ని ఉండి కూడా ప్రజలు దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వచ్చిందన్నారు. ప్రధానంగా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు పేదరికంలో నేటికీ మగ్గిపోవడంపై ఆయన ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో ఇకనైనా మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. అప్పుడే స్వాతంత్ర్యం సంపూర్ణంగా సిద్ధించినట్లవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. CM