బీహార్ ముఖ్యమంత్రి CM నితీష్కుమార్కు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రసంగిస్తుండగా ఒక యువకుడు దూసుకురావడంతో ఆందోళన కలిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భద్రతా బలగాలను కన్నుగప్పి మరీ నితీష్ చేరువకు వచ్చేంత వరకూ సెక్యురిటీ పట్టించుకోలేదు. దీనిపై విమర్శలు పెద్దయెత్తున వినపిస్తున్నాయి. బీహార్ లో జరిగిన ఈ ఘటన మరోసారి భద్రతావైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ ఘటనతో కొందరు సిబ్బందిపై వేటు పడే అవకాశముంది.
హై సెక్యురిటీ జోన్లోకి… CM
హై సెక్యురిటీ జోన్లోకి యువకుడు దూసుకురావడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రత సిబ్బంది వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు ఎందుకు అలా హైసెక్యూరిటీ జోన్లోకి వచ్చింది? ఎవరు ఆ యువకుడు? ఏం ఆశించి ఆ యువకుడు సీఎం సభలోకి నేరుగా ప్రవేశించాడు? భద్రతా లోపం ఎక్కడుంది? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
వరస వైఫల్యాలు..
నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా భద్రతా సిబ్బంది మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి కనీస భద్రత కల్పించాల్సిన సిబ్బంది ఎందుకు ఇలా వరస వైఫల్యాలను మూటగట్టుకుంటున్నారన్న ప్రశ్న తలెత్తుంది. ఈరోజు హై సెక్యురిటీ జోన్లోకి దూసుకొచ్చిన యువకుడు తనకు ప్రభుత్వం ఉద్యోగం కావాలని డిమాండ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడయినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. CM