వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Accident జిరగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ నిరుపేదలేనని తెలుస్తుంది. ఆటోను లారీ ఢీకొట్టగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్ కూడా ఈ ఘటనలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
అంతా నిరుపేదలే…
వరగంల్ జిల్లాల్లోని ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వర్థన్నపేట మండలం ఇల్లందు గ్రామం వద్ద వెళుతున్న ఆటోను అటువైపు వచ్చిన లారీ ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం పది మంది వరకూ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే వీరిలో ఆరుగురికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే స్థానికులు, పోలీసులు కలసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం… Accident
మృతులందతా అటవీ ప్రాంతంలో తేనెను సేకరించి పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్న వారే కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తులో లారీని వేగంగా నడిపినందునే ఈ విషాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. వీరంతా రోజువారీగా తేనె సేకరించి విక్రయించి తమ కుటుంబాలను పోషించే వారు కావడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. Accident