Warning
కరోనా అంటేనే భయం. మాస్క్ లు, శానిటైజర్ లు, భౌతిక దూరం పాటించడం వంటివి మాత్రమే కాదు. తొలి విడత, రెండో విడత కరోనాతో ఎంతో మంది అమాయకులు బలయి పోయారు. ఎందుకు కరోనా వస్తుందో తెలియదు. వాసన పోవడం, జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో వచ్చిన కరోనా అనేక కుటుంబాలను నాశనం చేసేసింది. ఇంకా అనేక మంది కరోనా తర్వాత వ్యాధులు సోకి ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రధానంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకి ఇప్పటికే అనేక మంది గతంలో కరోనా సోకి తగ్గిన వాళ్లు చచ్చి బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదేమో. లక్షలకు లక్షలు ఆసుపత్రుల బిల్లులు. వామ్మో.. ఒళ్లు గుల్ల.. జేబు ఖాళీ.
కరోనా అంటేనే…?
అందుకే కరోనా అంటే అందరికీ భయం. మూడు విడతల కరోనా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. పేద, గొప్ప తేడా లేకుండా కరోనా బారిన పడి అశువులు బాసిన వారు ఎందరో ఉన్నారు. చివరకు అంతిమ సంస్కారాలకు కూడా కుటుంబ సభ్యులు హాజరు కాలేని పరిస్థితి. అనాధ శవాల్లా తగులపడుతుంటే గుడ్లనీరు కుక్కుకుని చూడటం మినహా ఏం చేయలేక పోయం. సాధించలేకపోయాం. ఆ వ్యాధి ఎందుకు వస్తుందో తెలియదు. ఇంట్లో కూర్చున్న వారిని కూడా వదిలి పెట్టలేదు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. అటువంటి కరోనాకు ఏవో మందులు వాడి వైద్యులు ఏదో నయం చేశామని పించారు.
వ్యాక్సిన్లు వల్ల… Warning
చివరకు కరోనాకు వ్యాక్సిన్లు కనిపెట్టామన్నారు. ఏవో మందుల కంపెనీలు తెచ్చి జనాల భుజాన పొడిచేశాయి. అంతే మానసికంగా అందరం కరోనా నుంచి బయటపడ్డామన్న ఫీలింగ్ తో సంతృప్తి. కానీ వ్యాక్సిన్ వల్ల కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఇప్పుడు వైద్యులు చెబుతున్నారు. మొత్తం మీద కరోనా వచ్చిన రోజులు.. తర్వాత రోజులు జనం పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మూడు దశల్లో కరోనాను ఎదుర్కొన్న భారత్ కు మరోసారి ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అనేక దేశాల సంస్థలు చేస్తున్న హెచ్చరికలతో మరోసారి అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరో వేరియంట్…
అందుకే కరోనా అంటే ఇప్పటికే వెన్నుల్లో వణుకు రాక మానదు. అలాంటి కరోనా గత కొద్ది రోజులుగా మనల్ని వీడి వెళ్లిపోయిందని ఆనందపడ్డాం. సంతోషించాం. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలిచేలా కన్పించడం లేదు. కానీ కరోనా మరోసారి విజృంభించే అవకాశముందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల ప్రకారం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలట. ఈజీ – 5 వేరియంట్ రూపంలో కరోనా ముప్పు పొంచి ఉందంటున్నారు. ఇప్పటికే యాభై ఒక్క దేశాల్లో ఈ రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీనిని కొత్త వేరియంట్ గా పేర్కొంది. భారత్ లోనూ అందరూ దీనిపట్ల అవగాహన పెంచుకుని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా కూడా ఇచ్చేసింది. కాబట్టి పారాహుహార్… కరోనా ముప్పు పొంచి ఉందట. జాగ్రత్త. Warning