News
ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు ఎప్పుడూ ఎన్నికల వేళ వినపడుతుంటాయి. తమ డిమాండ్లకు ఏ ప్రభుత్వమైనా.. ఏ పాలకులైనా అప్పుడే పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉంది. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలకం కావడంతో ప్రభుత్వాలు కూడా ఆర్థికభారం గురించి ఆలోచించదు. ముందుగా ఎన్నికల గండం నుంచి బయటపడే ప్రయత్నాలను ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం అతీతం కాదు. ఎన్నికల వేళ ఉద్యోగులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా అనేక వరాలను ప్రకటిస్తుంది. అందులో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కూడా క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అనేక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అందరినీ…
కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేలా జగన్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించనున్నారు. గతంలో ఐదేళ్లు కాలపరిమితి విధించిన నిబంధనను కూడా జగన్ ప్రభుత్వం తొలగించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం లభించడంతో మరో నాలుగువేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని, కొద్దిరోజుల్లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధికారికంగా కాంట్రాక్టు ఉద్యోగులందరూ రెగ్యులర్ ఉద్యోగులుగా మారిపోతారు.
పాదయాత్ర చేేసే సమయంలో… News
ముఖ్యమంత్రి జగన్ తాను పాదయాత్ర చేసే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో అందరికీ న్యాయం చేస్తానని కూడా ప్రామిస్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారినే క్రమబద్దీకరించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సూచించడంతో ఆ నిబంధన తొలిగించారని తెలిసింది. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసేందుకు సిద్ధం అయింది. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు భారమయినా ఇచ్చిన మాట ప్రకారం జగన్ అమలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చిన మాటను నిలుపుకునే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరికొన్ని ఉద్యోగులకు ఉపయోగకరమైన నిర్ణయాలు కూడా ప్రభుత్వం నుంచి త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయని చెబుతున్నాయి.
జీతభత్యాలు…
ఇప్పటికే విద్యుత్ శాఖ సిబ్బందికి కూడా జగన్ వరాలు ప్రకటించారు. విద్యుత్తు శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దాదాపు 27 వేల మంది విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో భారీగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లబ్ది పొందనున్నట్లు చెబుతున్నారు. వారి జీతాలను 37 శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారి కుటుంబాల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. వీరికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కూడా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయానికి మరెన్ని కీలక నిర్ణయాలు వెలువడతాయో అన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వోద్యోగులు ఎన్నికల సమయంలో కీలకం కావడంతో ప్రభుత్వం వేగంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శలు విపక్షాల నుంచి వెలువడుతున్నాయి. News