గోల్డ్ (GOLD) అంటే ఎవరికి ఇష్టం ఉండదు. బంగారం ధరలు తగ్గితే సంతోషం. అలాగే స్థిరంగా కొనసాగినా ఆనందమే. బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. గోల్డ్, ల్యాండ్ ఎప్పుడూ డిమాండ్ ఉండేవే. వీటి ధరలు పెరగడమే కాని తగ్గడమనేది జరగదు. అందుకే ల్యాండ్ గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ పెద్దగా ఆలోచించరు. తాము కూడబెట్టుకున్న కొద్దిపాటి సొమ్ముతో వాటిని కొనుగోలు చేయడానికే చూస్తారు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ అధికంగానే ఉంటుంది. వాటి ధరలు కూడా అంతే. ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయడం బెటర్ అన్నది మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. ల్యాండ్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ల ఆఫీసులు ఎలా కిటకిటలాడుతుంటాయో బంగారం దుకాణాలు కూడా అంతే సీజన్ తో సంబంధం లేకుండా రద్దీగా ఉంటాయి.
దేశ విదేశాల్లో…
బంగారానికి దేశ విదేశాల్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే వివిధ రూపాల్లో బంగారం కొనుగోళ్లు జరుగుతుంటాయి. విదేశాల్లో ఎక్కువగా గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. దీనికి భద్రతతో పాటు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విక్రయించుకునే వీలుండటంతో అక్కడ ఎక్కువ మంది గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతారు. కానీ భారత్ లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా మహిళలు సెంటిమెంట్ గా భావిస్తూ బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదమని నమ్ముతారు. అందుకే పసిడి కొనుగోళ్లకు మగువలు ఎక్కువగా మొగ్గు చూపుతారు.
పెరగడానికి… (GOLD)
బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. దానికి అనేక కారణాలున్నాయి. బంగారాన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఎక్కువగా వినియోగించడం ఒక సంప్రదాయంగా ఉండటంతో ప్రపంచదేశాల్లో భారత్ లోనే ఎక్కువగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతారు. అందుకే ఇబ్బడి ముబ్బడిగా జ్యుయలరీ దుకాణాలు వెలిశాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎఫ్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ బంగారం కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాయి. పేదల నుంచి ధనికుల వరకూ బంగారం కొనుగోళ్లు చేసేందుకు ముందుకు వస్తుండటంతో వాటికి అంత డిమాండ్ ఏర్పడుతుంది.
వెండి ధర మాత్రం…
బంగారం ధరలు తగ్గితే సంతోషం. అలాగే స్థిరంగా కొనసాగినా ఆనందమే. దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,100 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 59,020 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 76,700 రూపాయలుగా నమోదయింది. పసిడి ప్రియులు ఈరోజు కొనుగోలు చేస్తే బంగారం తక్కువకే సొంతం చేసుకునే వీలుంటుంది. శ్రావణ మాసం సమీపించినా బంగారం ధరలు పెరగకపోవడం శుభవార్తగానే చూడాలని, రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందన్నది మార్కెట్ నిపుణుల అంచనా. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (GOLD)