(Online)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సుల కార్డుల కొరత తీవ్రంగా ఉండటం, స్టేషనరీ వ్యయం పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులతో పాటు, డిజిటల్ ఆర్.సి. కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కార్డులను జారీ చేయనున్నారు. ఇకపై వాహనాల ఆర్.సి.లతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు కూడా డిజిటల్ లోనే జారీ చేయనున్నారు. దీంతో డిజిటల్ కార్డుల జారీతో వినియోగదారులకు మరింత ఊరట కలగనుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఆర్టీఏ అధికారులు చుట్టూ తిరగాల్సిన పనిలేదని కూడా చెబుతున్నారు. డౌన్ లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకున్నవెంటనే వాటిని పరిశీలించి డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయనున్నారు.
వేల సంఖ్యలో…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల కార్డులు జారీ అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా స్టేషనరీ కొరత ఉండటంతో కార్డులజారీలో జాప్యం జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో కార్డులను రవాణా శాఖ జారీ చేస్తుంది. వాహనదారులు, పౌరుల నుంచి డబ్బు కట్టించుకున్నా వారికి కార్డులు జారీ చేయలేకపో్వడంతో అనేక విమర్శలను ఎదుర్కొంటుంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్సులకు, ఆర్.సిలకు రెండు వందల రూపాయల చొప్పున రవాణా శాఖ వసూలు చేస్తుంది. వారి చిరునామాకు వాటిని పంపేందుకు అదనంగా పోస్టల్ ఛార్జీల కింద ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా ఆర్.సి, డ్రైవింగ్ లైసెన్సులు మాత్రం చేరడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇకపై ఆన్ లైన్ లో… (Online)
ప్రభుత్వానికి ఇది ఇబ్బందిగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిన వాహన పరివార్ తో అనేక రాష్ట్రాల్లో ఈ సేవలన్నీ ఆన్ లైన్ లోకి మారాయి. దీంతో్ ఏపీ ప్రభుత్వం కూడా ఇకపై జారీ చేసే ఆర్.సి, డ్రైవింగ్ లైసెన్సులను డిజిటల్ గానే జారీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల స్టేషనరీ ఖర్చు భారీగా మిగలనుంది. నేరుగా ఆర్టీఏ అధికారులు సూచించిన డౌన్ లోడ్ చేసుకుని లైసెన్స్ లేదా ఆర్.సిని పొందే వీలుంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఏపీఆర్టీఏసిటిజన్ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా చెబుతున్నారు. వీటిని ట్రాఫిక్ పోలీసులకు చూపిస్తే సాధారణ డ్రైవింగ్ లైసెన్సు, లేదా ఆర్.సిగానే పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు.
మార్గదర్శకాలు…
దీనివల్ల ఏజెంట్ల కు చెల్లించాల్సిన అదనపు సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. ఏజెంట్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరం పూర్తయి కార్డులు ఆన్ లైన్ లో జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల వినియోగదారులకు సేవలు మరింత సులభతరంగా మారనున్నాయి. ఇకపై ఆంధ్రప్రదేశ్ లోని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లకుండానే తమడ్రైవింగ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకునే వీలుందని కూడా అధికారులు చెబుతున్నారు. పోలీసులు కూడా డిజిటల్ లైసెన్సులను అనుమతించాలని రవాణా శాఖ అన్ని ఆర్టీఏ అధికారులను కోరుతూ ఇప్పటికే సమాచారం పంపింది. ఈ మేరకు గైడ్ లైన్స్ విడుదలయ్యాయి. (Online)