భారత్ (IND) సిరీస్ ను కైవసం చేసుకునేందుకు సిద్ధమయింది. ఈరోజు ఐర్లాండ్ తో రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు రెండో టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో వర్షం కారణంగా డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో స్వల్ప పరుగుల తేడాతో ఓటమి పాలయిన ఐర్లాండ్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. ది విలేజ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
బుమ్రా నేతృత్వంలో…
సుదీర్ఘకాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన జస్పిత్ బుమ్రా భారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బుమ్రా కెప్టెన్సీలో తొలి మ్యాచ్ నే గెలుచుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చు. తొలి టీ 20లో కుర్రాళ్లు ఐర్లాండ్ ఆటగాళ్లను బాగానే కంట్రోల్ చేయగలిగారు. ఐర్లాండ్ బ్యాటర్లను త్వరితగతిన పెవిలియన్ కు పంపడంలో సక్సెస్ అయ్యారు. బూమ్రా ఫామ్ లోకి రావడం శుభపరిణామం. తొలి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు చేసి కేవలం 24 పరుగులు చేసి రెండు వికెట్లు పడకొట్టడంతో బూమ్రా రీ ఎంట్రీ అదిరిపోయిందనే భావించాలి. మరో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన ఆటతో ఆకట్టుకున్నాడు. 59 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ తర్వాత నిలదొక్కుకోవడంతో ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. (IND)
తక్కువగా అంచనా వేయడానికి… (IND)
ఐర్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. బ్యాటర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా స్టిర్లింగ్, బాల్ బిర్నీ, టెక్టార్ లు బ్యాట్ తో భారీ స్కోరును సాధించే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఈ మ్యాచ్ లోనూ వారిని భారత్ బౌలర్లు కట్టడి చేయాల్సి ఉంటుంది. లేకుంటే రెండో మ్యాచ్ కు చెమటోడ్చక తప్పదు. ముందుగా ఐర్లండ్ జట్టు బ్యాటింగ్ కు దిగితే వారిని తక్కువ పరుగులకే అవుట్ చేయగలిగితే ఈ మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించే అవకాశాలున్నాయి. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. అందుకే భారత్ బౌలర్లు ఈ మ్యాచ్ లోనూ విజృంభించక తప్పదన్న సంగతి అందరికీ తెలిసిందే.
టాప్ ఆర్డర్…
ఇక లక్ష్య సాధనలో అయినా.. ముందుగా బ్యాటింగ్ చేసినా భారత్ టాప్ ఆర్డర్ నిలదొక్కుకుంటే చాలు మంచి స్కోరు సాధించినట్లే. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లు బ్యాట్ కు పనిచెబితే చాలు పరుగుల వరద పారుతుంది. ఐర్లాండ్ ఎలాంటి లక్ష్యాన్ని మన ముందుంచినా పెద్ద కష్టమేమీ కాదు. ఇక హిట్టర్ రింకూ సింగ్ ఉండనే ఉన్నాడు. తొలి మ్యాచ్ లో ఆడే అవకాశం లభించకపోయినా ఈ మ్యాచ్ లో లభిస్తే ఐర్లాండ్ బౌలర్లకు రింకూ చుక్కలు చూపించడం ఖాయం. తొలి టీ 20 మ్యాచ్ లో విఫలమయిన హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ నాలుగు ఓవర్లుంటే చాలు స్కోరు బోర్డు పరుగులు తీస్తుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను గెలవాలని భారత్, తాము గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఐర్లాండ్ జట్టులు శ్రమిస్తున్నాయి. మరి రాత్రి 7.30 గంటలకు జరిగే మ్యాచ్ కోసం అందరం నిరీక్షించాల్సిందే. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే. (IND)