(PM)
ప్రధాని నరేంద్ర మోడీ15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా కు పయనమయ్యారు. ఈ సదస్సుకు ఆతిధ్యమిస్తున్న దక్షిణాఫ్రికాతో కూడా భారత్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ప్రధాని అడుగులు వేయనున్నారు. జొహన్నెస్ బర్గ్ లో రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మాటమెలా క్రిల్ రమాఫోసా అధ్యక్షత వహిస్తున్నారు. అభివ్రుద్ధి, పురోగతి, కలసి పనిచేయడం అనే మూడు అంశాలే థీమ్ గా సాగుతున్న ఈ సదస్సు విస్త్రుత ప్రాతిపదికన సుస్థిర పురోగతి, అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ పర్యటన వల్ల భారత్ తో బ్రెజిల్, రష్యా, చైనా తదితర దేశాలతో సంబంధ బాంధవ్యాలు బలపడే అవకాశం ఉంది.
దౌత్య సంబంధాలకు… (PM)
భారత, దక్షిణాఫ్రికా దేశాల మధ్య 30 ఏళ్ల దౌత్య సంబంధాలకు అద్దం పట్టే ఓ చారిత్రక సన్నివేశం ఈ సదస్సు,రెండు దేశాల మధ్య పరస్పర సహకారం, గౌరవంతో కూడిన బలమైన బంధం ఉంది. వాణిజ్యం నుంచి విద్య వరకూ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం గత కొంత కాలంగా గణనీయంగా మెరుగుపడింది. ఈ సదస్సు ద్వారా భారత, ఆఫ్రికా సంబంధాలు మరింత బలపడనున్నాయి.
అందరి దృష్టి …
బ్రిక్స్ సదస్సు కేవలం ఆర్థిక చర్చల వేదిక మాత్రమే కాదు.. ప్రజారోగ్యం, కోవిడ్ 19 పాండమిక్ తర్వాత పరిస్థితులను తట్టుకునే అంశంపైనా ప్రధానంగా చర్చలు జరగబోతున్నాయి. దేశాలను పట్టిపీడిస్తున్న కామన్ సమస్యలను అడ్రస్ చేస్తూ వాటికి పరిష్కారాలను సాధించే దిశగా బ్రిక్స్ సదస్సు అడుగులు వేయనుంది. భారత్ తరపున మోడీ ప్రాతినిద్యం వహిస్తున్నందున భారత్ లాంటి శక్తివంతమైన దేశాలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎలా కార్యాచరణ రూపొందిస్తాయన్న అంశంపైనే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
మోడీ ఏమన్నారంటే.. (PM)
బ్రిక్స్ సదస్సు పై స్పందించిన మోడీ (PM) ఈసారి సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు. పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివ్రుద్ధికి సంబంధించిన అంశాలు, బహుళ పక్ష వ్యవస్థల సంస్కరణలపైనా చర్చించడానికి బ్రిక్స్ సదస్సు బాగా ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నానని మోడీ తన ప్రకటనలో తెలిపారు.
పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని ఎక్స్ ( ట్విట్టర్ ) లో ఓ పోస్ట్ పెట్టారు. జొహన్సెస్ బర్గ్ లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళుతున్నాను.. బ్రిక్స్- ఆఫ్రికా,బ్రిక్స్ ప్లస్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివ్రుద్ధి అంశాలపై చర్చలే ఈ వేదిక ప్రధాన అజెండా అని మోడీ ట్వీట్ చేశారు.
గ్రీస్ పర్యటనకూ… (PM)
ఆగస్టు 22నుంచి 24 వరకూ జరిగే ఈ సదస్సు తర్వాత మోడీ గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 తర్వాత జరుగుతున్న బ్రిక్స్ సదస్సు కావడం దీనికి మోడీ హాజరు అవుతుండటం వల్ల ఈ సదస్సుపైనే ప్రపంచ దేశాల ద్రుష్టి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశాలకు గైర్హాజరవుతుండగా ఆయన తరపున రష్యా విదేశాంగ మంతి సెర్గీ లవ్రోవ్ వస్తున్నారు.
బ్రిక్స్ సదస్సు వేదికగా ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలుస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. బ్రిక్స్ సదస్సులో అంతర్జాతీయ స్థాయి నేతలు చర్చలద్వారా, సంప్రదింపుల ద్వారా, ఒప్పందాల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నారు.బ్రిక్స్ సదస్సును ముందు ముందు కొనసాగించడం వల్ల దేశాల మధ్య తలెత్తే సవాళ్లను పరిష్కరించుకోడానికి ఉపయోగపడే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. (PM)