(Sam)
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం తన వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. ఖుషీ మూవీ షూటింగ్ తర్వాత సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన సమంత ఈ లీవ్ లోనే తనకున్న మయో సైటిస్ సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఇదే వ్యాధి బారిన పడి చాలా బలహీనంగా మారిన సమంత ట్రీట్ మెంట్ తర్వాత కోలుకుని ఖుషీ మూవీని పూర్తి చేసింది. అయితే బయటకు చెప్పకపోయినా ఈ బ్యూటీని ఆ వ్యాధి ఇంకా పీడిస్తోందని సమంత ని చూస్తే తెలుస్తోంది. దీనికి తోడు నాగచైతన్యతో విడాకుల తర్వాత బాగా డల్ గా అయిపోయిన సమంత ఇప్పుడిప్పుడే ఆ డల్ నెస్ నుంచి బయటపడేందుకు ట్రై చేస్తోంది.
సోషల్ మీడియాలో…
తరచుగా విహార యాత్రలకు వెళ్లడం, సన్నిహితులు, స్నేహితుల మధ్య గడపడం ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ మధ్యనే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సింగర్ చిన్మయి కవల పిల్లలను ముద్దాడుతూ ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సామ్ ఇలా రిలాక్స్ అవుతూ తన డల్ నెస్ ను జయించడానికి ట్రై చేస్తోంది. సామ్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడాలి అంటే ఆమె అమెరికాలో హాజరైన ఓ ఈవెంట్ కన్నుల పండువగా సాగడమే కారణమని చెప్పాలి. అమెరికాలోని ఇండియా 41 పెరేడ్ వేడుకలకు అతిధిగా ఆమె హాజరయ్యింది. తన అభిమానులతో న్యూయార్క్ వీధుల్లో పెరేడ్ చేసింది .(Sam)
న్యూయార్క్ లో…
నవ్వుతూ, తుళ్లుతూ ఉన్న సమంత ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జైహింద్.. ఇది నాకు ఇచ్చిన నిజమైన గౌరవం.. ఇది మన సంస్క్రుతి, సంపద ఎంత గొప్పవో నాకు తెలియ చెప్పిన సందర్భం.. దీన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను అని సమంత సోషల్ మీడియో షేర్ చేసింది.నాకు సపోర్ట్ చేసిన వారికి, నా ప్రతీ సినిమాను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరునా క్రుతజ్నతలు అని షేర్ చేసింది సామ్.న్యూయార్క్ లో తన ట్రిప్ విశేషాలను ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలతో షేర్ చేస్తున్న సామ్ ను ఆమె అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు..గులాబీరంగు చికెంకారీ కుర్తాతో క్లోజ్ అప్ సెల్ఫీని సామ్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో ను చూసిన ఫ్యాన్స్ పూర్తిగా ఫిదా అయిపోయారు. ఆమెను బార్బీ డాల్ తో పోల్చి ప్రశంసలు కురిపించారు.రియల్ లైఫ్ బార్బీ అంటూ కితాబిచ్చారు.
ఖుషీ మూవీ విడుదలవుతున్న… (Sam)
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ ను అక్కినేని అభిమానులు బాగా ట్రోల్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం మూవీ డిజాస్టర్ గా మారడం,యశోద మూవీ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో సామ్ కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగింది. ఈలోగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వ్యాధి అయిన మయో సైటిస్ కమ్మేసింది. ఈ వ్యాధినుంచి కోలుకోడానికి తీవ్రంగా శ్రమించిన సామ్ ఇప్పుడు మళ్లీ ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. అందుకే పేరెంట్స్ తో కలసి అమెరికాలో ట్రీట్ మెంట్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషీ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. దాంతో పాటు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ స్పై థ్రిల్లర్ సీరీస్ కూడా రాబోతోంది. దీనిలో ఆమె బాలీవుడ్ స్టార్ వరుణ్ థావన్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంది. (Sam)