(Alert)
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పలు చోట్ల కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం నుంచి రేపు రాత్రి వరకూ గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా అలెర్ట్ జారీ చేసింది.
గ్రీన్ అలర్ట్…
మెదక్, ములుగు, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. దీంతో పాటు హైదరాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, జనగాం, మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అందుకే ఈ పది జిల్లాలకు గ్రీన్ అలర్ట్ ను అధికారులు జారీ చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభమయ్యే వర్షాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొంది. ఈ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
వార్నింగ్… (Alert)
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో రహదారులు జలమయ్యే అవకాశముందని తెలిపింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మ్యాన్ హోల్స్ ను ఎక్కడా స్థానికులు తెరచి ఉంచవద్దని కోరింది. మ్యాన్ హోల్ ఉందని తెలియక అందులో పడే అవకాశముందని, నీటి తొలగింపు కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే చేపడతారని, స్థానికులు తమంతట తాము మ్యాన్ హోల్స్ తెరవద్దని సూచించింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ కూడా ముందస్తు చర్యలు చేపట్టనున్నారు. రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా, ఎక్కడా వాహనాలు ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటామని, పౌరులు కూడా తమకు సహకరించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.
ఏపీలో కూడా…
తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా తీర ప్రాంతంలో గంటకు నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో గాలులు బలగా వీస్తాయని కూడా పేర్కొంది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని గట్టి హెచ్చరికలు జారీ శారు. ప్రధానంగా బాపట్ల, పార్వతీపురం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అలెర్ట్ చేశారు. (Alert)