(Tirupathi)
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల దర్శనం,సేవలు, అంగ ప్రదక్షిణలు సహా అన్ని రకాల ఆన్ లైన్ టికెట్లకు సంబంధించి షెడ్యూల్ ఇస్తోంది. నవంబర్ నెలకు సంబధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పటికే ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయగా..వర్చువల్ సేవా టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు. అలాగే వసతి గదులు,రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను సైతం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
ప్రధానాంశాలు
* తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు
*ఆర్జిత సేవ టికెట్ల విడుదల చేస్తున్నారు
*వసతి గదులు కోటా కూడా రిలీజ్ కానున్నాయి
నవంబరు నెల కోటా…
టీటీడీ నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవ టికెట్లు, వసతి గదులు షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం నవంబరు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు,దర్శన టికెట్లు కోటా వివరాలను వెల్లడించింది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే కల్యాణోత్సవం,ఆర్జిత బ్రహ్మోత్సవం,ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేశారు.
వర్చువల్ సేవా టిక్కెట్లు… (Tirupathi)
మరోవైపు వర్చువల్ సేవా టికెట్లను ఇవాళ (ఆగస్టు22) మధ్యహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అంగప్రదక్షిణం టోకెన్లను ఆగస్టు23వ తేదీ ఉదయం10 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు,దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలలో వసతి గదుల బుకింగ్ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయలను గమనించి
24 నుంచి అవతార మహొత్సవాలు
ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీతిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం ఆగస్టు 24వ తేదీ తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఉదయం9.30 గంటల నుండి 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమలనంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు. శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమాన, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ప్రచారంలో ఉన్న … (Tirupathi)
ఆచార్య పురుఘడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వరస్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్రజలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాపవినాశనం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాడి రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు.
అప్పటి నుంచి… (Tirupathi)
అందుకు తిరుమలనంబి బాధపడుతూ”వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు, ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా”అంటూ దు:ఖించారు. అందులో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు “చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా” అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ఇరపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యరు. అప్పుడు తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపం ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు.ఆకాశంగంగ అని నామధేయం ఏర్పడింది.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు 18-ధ్వజారోహణం
సెప్టెంబరు 22- గరుడ వాహన సేవ
సెప్టెంబరు 23- స్వర్ణ రథం
సెప్టెంబరు 25-రథోత్సవం (మహరథం)
సెప్టెంబరు 26- చక్రస్నానం,ధ్వజావరోహణం
నవరాత్రి బ్రహ్మోత్సవాలు
అక్టోబరు 19-గరుడవాహన సేవ
అక్టోబరు 22- స్వర్ణరథం
అక్టోబరు 23- చక్రస్నానం
రద్దయిన సేవలివే...
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడై, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్యస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాలు జరుగనున్న సెప్టెంబరు 18 నుంచి26, అక్టోబరు 15 నుంచి 23 మధ్య ఈ సేవలు అందుబాటులో ఉండవు. ముందుస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్ధేశిత వాహనసేవకు మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. నవారాత్రి బ్రహ్మొత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబరు 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. (Tirupathi)