45
ప్రాజెక్ట్ చంద్రయాన్ భారత, బ్రిటన్ దేశాల మధ్య సరికొత్త పంచా యతీకి తెరలేపింది..ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 45 ట్రిలి యన్ల డాలర్లు బాకీ చెల్లించాలంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. చంద్రయాన్-3 సక్సెస్ అవడం యావద్భార తాన్ని సంతోషంలో ముంచెత్తుతుంటే సోషల్ మీడియాలో ఈ వార్ సరికొత్త హీట్ రేపింది.
సంపన్న భారత్ కు అప్పులెందుకు?
బ్రిటన్ కు చెందిన జర్నలిస్ట్ సోఫీ కార్కొరాన్ ఈ విజయంపై అక్కసు వెళ్ల గక్కారు. ప్రాజెక్ట్ చంద్రయాన్ భారత్ చేపట్టగలిగిందంటే చాలా సంపన్నదేశమని భారత్ ను అర్ధం చేసుకోవాలని బ్రిటన్ ఆదేశానికి అందిస్తున్న సాయాన్ని ఇక తక్షణం నిలిపివేయాలని సోషల్ మీడియా వేదిక X లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇప్పటి వరకూ భారత్ కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని వెనక్కు తీసుకోవాలని కూడా ఆమె కామెంట్ చేశారు. అంతరిక్షంలో చీకటి చంద్రునిపైకి రాకెట్లు పంపే సత్తా ఉన్న దేశానికి ఇక విదేశీ ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు.
ఘాటుగా తిప్పికొట్టిన భారతీయులు!
సోఫీ కొర్కారన్ ఇలా పోస్ట్ చేశారో లేదో క్షణాల్లో ఈ కామెంట్ పై బ్రిటన్ లోని ప్రవాస భారతీయులు విరుచుకుపడ్డారు.. తెల్లదొరల పాలనలో భారత్ ను శతాబ్దాలుగా పీడించి దండుకు పోయిన సొమ్మునంతా అణా పైసలతో ముందు వెనక్కి చెల్లించండంటూ కౌంటర్ ఇచ్చారు.. ఓ వైపు చంద్రయాన్ సక్సెస్ పై మనదేశంలో సంబరాలు చేసుకుంటుంటే బ్రిటన్ లో మాత్రం చర్చ పక్క దారి పట్టింది. సోషల్ మీడియాలో అసలు విషయం వదిలేసి 45 ట్రిలి యన్ డాలర్ల సొమ్ము బాకీ అనే అంశంపైనే చర్చ జరిగింది. ఎవరు ఎవరికి బాకీ అన్న విషయం మాత్రం ఎవరికి వారు లెక్కలు చెప్పారు.. భారత్ నుంచి ఈ సొమ్మును వసూలు చేయాలని బ్రిటన్ చెబుతుంటే.. మా దేశం నుంచి దండుకున్న సొమ్ములోంచి ఈ 45 ట్రలియన్ డాలర్ల సొమ్మును మైనస్ చేసుకోమని, అదనంగా కోహినూర్ కూడా రిటర్న్ చేయమని శశాంక్ శంకర్ ఝా అనే ఇండియన్ కౌంటర్ ఇచ్చారు.
45 ట్రలియన్ల పంచాయతీకి మూలం ఎక్కడ?
ఈ 45 ట్రిలియన్ల రచ్చ కు మూలం ఓ ఆర్థిక వేత్త అధ్యయనం చేసిన రిసెర్చ్ పేపర్ కారణమని తెలుస్తోంది. ఉత్సా పట్నాయక్ అనే ఆర్ధిక వేత్త 1765-1938 మధ్యకాలంలో భారత్ నుంచి బ్రిటీషర్లు దోచుకున్న సొమ్ముపై స్టడీ చేసి ఈ మొత్తాన్ని లెక్క గట్టారు. బ్రిటన్ నేటి జీడీపీ కన్నా ఇది 15 రెట్లు ఎక్కువ అని ఉత్సా పట్నాయక్ అన్నారు. రెండు శతాబ్దాలలో టాక్స్, వాణిజ్యానికి సంబంధించిన డాటాలను అధ్యయనం చేసి పట్నాయక్ ఈ లెక్క తేల్చారు.
అయితే భారత్ కు బ్రిటన్ అందిస్తున్న ఆర్థిక సాయం 2015లోనే నిలిపివేసినట్లు గార్డియన్ పత్రిక ఈ ఏడాది మార్చిలో రిపోర్ట్ ప్రచు రించింది. తమకు అవసరం లేదని భారత్ చెప్పాకే బ్రిటన్ ఈ సాయాన్ని నిలిపేసిందని ఆ పత్రిక రాసింది. అయితే ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఎయిడ్ ఇంపాక్ట్ అనే సంస్థ మాత్రం 2016-2021 మధ్య కాలంలో 23 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం భారత్ కు అందిందని చెబుతోంది.బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అంత ర్జాతీయ పెట్టుబడుల సంస్థ ఈ సొమ్మును చిన్న చిన్న కంపెనీలకు అప్పుగా ఇచ్చిందని ఆ నివేదిక తెలిపింది.