శివాలయంలోకి అడుగుపెట్టగానే మనకు పరమేశ్వరుని కంటే ముందుగా నందీశ్వరుడే(Nandeeswarudu) దర్శనమిస్తాడు. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని దర్శించుకుంటారు, మరికొందరు ఆయన చెవిలో తమ కొరికలను చెప్పుకొంటారు. నంది.. పరమేశ్వరునికి ద్వారపాలకుడు.
కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత వచ్చిందా?
నందీశ్వరుని(Nandeeswarudu) చరిత్ర చూస్తే అది తప్పనే అనిపిస్తుంది . పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేరు అనే లోటుగా ఆయనకు ఎప్పుడు ఉండేదట . ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలగాలని ఆ పరమశివుని కై తపస్సు చేయసాగాడట శిలాదుడు.ఏళ్లూ ,ఊళ్లూ గడిచిపోయాయి, ఎండా, వానా వచ్చిపోయాయి… కానీ శిలాదుని తపస్సు ఆపలేదు. ఆతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ఠ గా తపస్సు చేసాడట .
నందీశ్వరుని జననం
ఎట్టకేలకు శిలాదుడి ఎదుట ప్రత్యక్షం అయ్యాడు ఆ పరమశివుడు. ‘నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని ప్రసాదించు ‘ అని ఆ పరమేశ్వరుడిని కోరాడట శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు ‘తథాస్తు’ అంటూ వరాన్ని అనుగ్రహించాడట . శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని చేస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి ‘నంది’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడట శిలాదుడు.
నంది అంటే అర్థమేంటి..?
నంది (Nandeeswarudu) అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట. బాలుని జననం లాగానే… అతని మేధా శక్తీ కూడా అసాధారణంగా ఉండేదట.నంది అతి చిన్న వయస్సు లో నే సకల వేదాలన్ని ఔపోసన పట్టి ఎంతో జ్ఞానవంతుడయ్యాడు. అయితే ఓ రోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి వారు మురిసిపోయారట . అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారట.
ఆలా నంది (Nandeeswarudu)వంక దీక్షగా చూసి ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదుట . ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని వారి నుంచి తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదట పై పెచ్చు తన తల్లితండ్రుల కు ధైర్యం చెప్పి నేను ‘శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు’ అంటూ…పరమేశ్వరిని కి తపస్సు చేయడానికి బయల్దేడారట
శివుడి కోసం తపస్సు
శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అతి తక్కువ కాలం లో నే అతనికి ప్రతేక్షమై ఎం వరం కావాలో కోరుకోమన్నాడట . శివయ్యని చూసిన నదీశ్వరునికి నోట మాట రాలేదుట అంతటి పరవశం లో మునిగిపోయాడట నంది . ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అని మనస్సు లో అనుకున్నాడు.
ఈశ్వరున్ని చుసిన తర్వాత తన ఆయుష్షు గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా ‘ఎప్పటికి నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ’ అని శివుని వేడుకున్నాడట నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడట ఆ పరమ శివుడు .ఆనాటి నుండి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ ఆయన ప్రమథ గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణ గా ఉంటు తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామిభక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి.