ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి కి సమీపం లో ని తిరుమల(Tirumala) లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. ఇక్కడికి స్వామి వారి ని దర్శించుకోవడానికి ప్రతిరోజూ భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకన కూడా వెళుతుంటారు. తిరుమల(Tirumala) మెట్ల మార్గం ద్వారా గోవిందా గోవిందా అనే నామ స్మరణ తో పరమ పవిత్రం గా తిరుమల కొండా చేరుకుంటారు. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా సరిపోవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు అందుకు కారణం ఏంటో తెలుసా. ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో..తెలుసా.
తెలుసుకోవాలంటే ఈ కధ చదవాల్సిందే
శ్రీవారి భక్తులలో అగ్రగణుడు మరియు అంత్యంత ఇష్టమైన భక్తుడు అనంతాళ్వార్. ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించే అంతటి భక్తుడు శ్రీ అనంతాళ్వార్. ఇతడు తిరుమల(Tirumala) కొండ వెనుక భాగంలో నివసించేవారట. ఈయన ప్రతిరోజూ స్వామి వారి అలంకరణ కు ఉపయీగించేటువంటి పూలమాలల ను ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించేవారుట. ఆయన ఒక రోజు తానే స్వయం గా స్వామి వారికీ ఉపయోగించే పూలమాలల కోసం ఒక పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారట. పూలతోటను పెంచాలని నిర్ణయిచుకున్న తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వి అందులోని నీరు ని ఉపయోగించుకోవచ్చు అని, చెరువు త్రవ్వడం మొదలు పెట్టారట.
శ్రీ అనంతాళ్వార్ ఆ తిరుమలేశునికి ఎంతటి భక్తుడు కాకపోతే ఆ చెరువును ఇతరులు ఎవరి సహాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరే కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకునరట. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారు ని భార్య నిండు చూలాలట అంటే తొమిది నెలల నిండు గర్భిణీ. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె ఆ ఆ మట్టి ని గంపలోకి తీస్కొని ఎత్తి దూరంగా పడేసేదట. ఈ తతంగం అంతా చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. తన భక్తుల కష్టం చూడలేక ఆ శ్రీహరే స్వయంగా ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వచ్చారట.
గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అని అడిగాడట. దానికి అనంతాళ్వారు ఒప్పుకోలేదట కాని అతని భార్య అంగీకరించడంతో బాలుని రూపం లో ఉన్న శ్రీవారు ఆమెకు సాయం. ఆమె తన భర్త అనంతాళ్వారు కు తెలియకుండా మట్టి తట్టని ఆ బాలుడికి తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడట. నిండు చూలాలు అయినా తన భార్య ఇంత త్వరగా మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా వెనక్కి రావడంగమనించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించడట దానితో ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్పిందట.
తాను వద్దన్నా కూడా ఆ బాలుడు మల్లి సాయం చేయడం అనంతాళ్వార్ కు నచ్చలేదట పైగా పట్టరాని ఆగ్రహం తో అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురాడట. అది ఆ బాలుడు గడ్డానికి తగిలిందట. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు తిరుమల లో ని ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోయారట. తిరుమల శ్రీవారి ఆలయంలోని అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం నుంచి రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారు కు చెప్తారట. దాంతో కంగారు గా అతడు ఆలయానికి చేరుకుని గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోయారట.
తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామి వారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడి ఎంతో భాదపడ్డారట. గాయం వలన కలిగే బాధ నుండి ఉపసమయం పొందడానికి రక్తాన్ని ఆపడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్ధారట. అప్పటినుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవారట. అప్పటి నుండి తిరుమల శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయిందట. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని చూడాలి అనికుంటే తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం కూడా మనం చూడవచ్చు.