హిందూ కాలమానాల ప్రకారం ఒక్కో ఏకాదశి కీ ఒక్కో పేరు ఉంటుంది. ఆ పేరు వెనుక కూడా ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా శ్రావణమాసంలోని వచ్చే మొదటి ఏకాదశికి పుత్రద ఏకాదశి (Putrada Ekadashi) అని పేరు. ఈ పుత్ర ఏకాదశి ని “పవిత్ర ఏకాదశి” అని కూడా అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్లన సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహం లభిస్తుందని మరియు మంచి సంతానం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశి ఎలాంటి విశేషమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా..!
వివాహమై సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ శ్రీ హరిని విష్ణు సహస్రానామలతో పూజించినట్లైతే తప్పక సంతానం కలుగుతుందట. అందుకే ఈ ఏకాదశి కి పుత్రాద ఏకాదశి (Putrada Ekadashi) అని అంటారట. ఈ వ్రతాన్ని సంపూర్ణ నియమాలు తో ఆచరిస్తారో వారి కోరికలన్నిటిని నెరవేరుస్తాను అని అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించిన వ్రతధారి సకల భోగ భాగ్యాలను పొంది వైకుంఠాన్ని ప్రాప్తి కూడా పొందుతారని సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీ మహా విష్ణువు (Lord Vishnu) చెప్పారని పురాణాలు చెబుతున్నాయి.
పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత..
సంతానం లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదించి వారికి సంతోషం కలిగించే శక్తి శ్రావణ పుత్ర ఏకాదశి వ్రతానికి ఉందని నమ్ముతారు. దీనితో పాటు, ఇప్పటికే పిల్లలు ఉన్న భక్తులకు కూడా ఈ ఉపవాసం ఉత్తమం అని చెప్తున్నారు పండితులు. ఈ వ్రతము వలన కలిగే శుభఫలితము వలన పిల్లల జీవితములో ఎల్లప్పుడు సుఖ సంతోషము నెలకొంటుందని అంటారట. పుత్ర ఏకాదశి వ్రత కథను ఎవరు విన్నా లేదా చెప్పినా స్వర్గప్రాప్తి పొందుతారని పురాణాల్లో చెప్పబడింది .
పుత్రద ఏకాదశి కథ (Putrada Ekadashi)
వివరించిన ఈ పురాణ గాథ…
పుత్రద ఏకాదశి విశిష్టత కూడా భవిష్యపురాణంలో చెప్పబడింది . దీని ప్రకారం- పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడరట. ఆయన రాజ్యంలోని వారంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారుట. ధనానికీ, ధాన్యానికీ ఆ రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు. కానీ ఆ రాజు కి సంతానం లేకపోవడంతో ప్రజలంతా బాధగా ఉండేవారట. మహిజిత్తు మాహా రాజు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదుట. కానీ ఎన్ని సంవత్సరాలైనా వారికి సంతానం కలగలేదట.
ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడు అనే మహర్షి ఉన్నరని తెలిసి తమ సమస్య కు ఏమైనా పరిస్కారం చెప్తారని ఆ మహర్షి దగ్గర కు వెళ్లారట. ఏ వ్రతాన్ని ఆచరిస్తే, తమ రాజుకు పుత్రసంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమశు మహర్షి ని వేడుకున్నారట . దాంతో ఆయన శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే… రాజుగారికి సంతానం కలిగితీరుతుందని చెప్పారట. లోమశుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రతాన్ని ఆచరించారత. లోమశుడు చెప్పినట్లుగానే..రాజుగారికి పుత్రసంతానం ప్రాప్తించిందట. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పేరు వచ్చిందని భవిష్య పురాణం లో చెప్పబడింది.
ఈ శ్రావణశుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటి అంటే ఈ రోజు కుబేరుని జన్మదినం కూడా అని పండితులు చెబుతున్నారు. సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఈ రోజు కుబేర యంత్రాన్ని పూజించినా, కుబేర మంత్రాన్ని జపించినా, కుబేర అష్టోత్తరాన్ని పఠించినా విశేషమైన ఫలితం దక్కుతుందట.
ఎంతో విశిష్టత ఉన్న ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో లోమశ మహర్షి చెప్పారు..మరి ఆ వ్రత విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రావణ పుత్రదా ఏకాదశి పూజ విధానం:
- పుత్రద ఏకాదశి (Putrada Ekadashi) వ్రతం చేయాలనుకునే దంపతులు, దశమినాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి.
- ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి.
- ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి.
- విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి.
- ఆ ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా.
- ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే, దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి.
- ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి.
ఇలా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు స్వీకరించవచ్చట అంతే కాకుండా ఆరోగ్య సమస్య రీత్యా ఎవరైనా జాగరణ చెయ్యలేను వారు ఏకాదశి గడియలు ముగిసాక చంద్ర దర్శనం చేస్కుని ఉపవాసం విరమించ వచ్చని పండితులు చెబుతున్నారు. ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు. ఇక సంతానం ఒక లెక్కా!