(Love)
మెట్రో కల్చర్ మనుషుల జీవితాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. యువతీ యువకుల మధ్య పరస్పర ఆకర్షణే ప్రేమ అనుకుని హద్దులు , సరిహద్దులు దాటేస్తున్నారు. కొందరు ఆవేశంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..మరికొందరు మరింత ముందుకు పోయి కలసి ఉంటున్నారు.. ఇష్టం లేకపోతే సులభంగా విడిపోవచ్చనే ఉద్దేశంతో.
కానీ ఆలోపే ఆవేశాలు హద్దులు దాటుతున్నాయి. నమ్మకాలు వమ్మవుతున్నాయి. ఇద్దరి మధ్యా అనుమానమనే చిన్న బిందువు వట వ్రుక్షంలా పెరిగి అసూయకు, కోపానికి కారణమవుతోంది. క్షణికావేశంలో ప్రాణం తీసేస్తోంది.
కలసి మెలిసి తిరిగారు (Love)
ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు.. కలసి తిరిగారు..స్నేహం కుదిరింది. ఆపై అది వ్యామోహంగా మారింది. ప్రేమకు(Love), వ్యామో హానికి మధ్య తేడా ఇద్దరికీ తెలియలేదు. తెలుసుకునేలోపే ఒక ప్రాణం పోయింది.
హ్రుదయ విదారకమైన ఈ సంఘటన బెంగళూరు లో జరిగింది. ఇద్దరికీ పట్టుమని పాతికేళ్లు కూడా లేవు..కానీ ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆ ఇష్టమే ప్రేమనుకున్నారు.అది కాదని తేలేసరికి సఖ్యత ఆవిరైపోయింది. చివరకు బంగారం లాంటి ప్రాణమే పోయింది. తిరువనంత పురానికి చెందిన 24 ఏళ్ల దేవా కేరళాలోని కొల్లంకు చెందిన వైష్ణవ్ బెంగళూరులోని బేగూర్ లో మైకో లేఅవుట్ లో ఓ అపార్టుమెంట్ లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరూ కేరళకు చెందిన వారే కావడం, ఒకే కాలేజీలో చదవడంతో స్నేహం కుదిరింది. అది కాస్తా చనువు పెంచింది. పెద్దలు వద్దన్నారో లేక మరే అభ్యంతరమో తెలీదు కానీ ఇద్దరూ బెంగళూరు వచ్చేశారు. సేల్స్, మార్కెటింగ్ రంగంలోఉద్యోగాలు సంపాదించారు. దాంతో ఇద్దరి మధ్యా మరింత చనువు పెరిగింది. ఇక చెప్పేదేముంది..
అనుమానమే శాపం
ఇక్కడే అసలు కథ మొదలైంది.. ఇద్దరి మధ్యఉన్నది ప్రేమ కాదని తేలిపోయింది. దేవా మీద తరచుగా వైష్ణవ్ అనుమానం వ్యక్తం చేసేవాడు..ఆమెకు ఇతరులతో సంబంధాలు అంటగట్టి తూలనాడే వాడు.. అనుమానంతో వేధించుకు తినేవాడు. ఇద్దరూ తరచూ గొడవ పడేవారనీ, కొట్టుకునే వారనీ చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
ఇద్దరి మధ్యా ఇన్ని గొడవలు జరుగుతున్నా ఎవరూ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ మాత్రం ఇచ్చుకోలేదు. వైష్ణవ్ కు చనిపోయిన మహిళ దేవాపై అనుమానం ఉండేది. అందువల్ల ఇద్దరూ తరచుగా గొడవలు పడేవారు. ఆదివారం కూడా ఇద్దరి మధ్యా పెద్ద గొడవ జరిగింది. కోపం పట్టలేని వైష్ణవ్ దేవాపై కుక్కర్ తో దాడి చేశాడు.స్టీలు కుక్కర్ అందునా బరువైన ది కావడంతో దేవా తలపగిలి తీవ్ర రక్తస్రావమైంది. దాంతో మహిళ చనిపోయింది. సంఘటన జరిగిన వెంటనే నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నిం చాడు. అయితే పోలీసులు పట్టుకుని అతగాడిపై కేసు పెట్టారు. వైష్ణవ్ పై మర్డర్ కేసు నమోదైంది. అరెస్టు చేసి జైలుకు తరలించి నట్లు ఇంటరాగేషన్ లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు..
దేవా కుటుంబీకులకు ఈ ఘటనపై సమాచారం అందించినట్లు పోలీసులు చెప్పారు. చేతికందిన పిల్ల అన్యాయంగా బలైపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొత్తానికి వంటింట్లో కుక్కర్లు కూడా మారణాయుధాలుగా మారిపో తున్నాయి..క్షణికావేశంలో ప్రాణం తీసేంత మూర్ఖత్వం మనుషుల్లో పెరిగిపోతోంది.
నిండు ప్రాణం గాల్లో కలిసింది.