(IND)
ఆసియా కప్ కోసం భారత్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు శ్రీలంకకు వెళ్లనున్నారు. నేడు టీమిండియా బయలుదేరనుంది. అయితే హోమ్ స్ట్రింగ్ సర్జరీ చేయించుకున్న కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. 100 శాతం ఫిట్ గా ఉన్నాడు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి రావాలని ఉవ్విళ్లూరుతున్న రాహుల్, టోర్నీ చివరి భాగంలో భారత్ జట్టులో చేరే అవకాశముందని తెలుస్తోంది.
కఠోర సాధన….
బెంగళూరులోని ఆలూర్ లో ఆసియా కప్ 2023 కోసం భారత్ క్రికెట్ జట్టు కఠోర సాధన కొనసాగించింది. ఆదివారం కూడా ప్రాక్టీస్ చేసింది. సండే ఆటగాళ్లకు విరామం ఇచ్చినా విశ్రాంతి తీసుకోలేదు. ఎన్ సీఏలో జరిగిన ఈ సమావేశానికి కోహ్లీ, రోహిత్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు. టీం ఇండియా ప్రత్యేక పద్ధతిలో సాధన చేస్తుంది. ఆటగాళ్లంతా డెక్సా టెస్టింగ్ లో కూడా పాల్గొన్నారు.
ఒకే గ్రూపులో ఇండియా, పాక్…. (IND)
ఆసియా కప్ లో ఒకే గ్రూపులో ఇండియా పాకిస్తాన్ ఉన్నాయి. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ జై షా గురువారం క్యాలెండర్ ను ప్రకటించారు. ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. 2022లో జరిగిన ఆసియాకప్ లోనూ ఈ రెండు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ స్టేజ్ తోపాటు సూపర్ 4 లోనూ మరోసారి ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. ఇండియా పైనల్ చేరకపోవడంతో ఒకే టోర్నీలో మూడోసారి ఇండో పాక్ వార్ చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు. అయితే 2023లో జరిగే ఆసియాకప్ లో మరోసారి ఆ అవకాశం రావచ్చు.
ఆసియాకప్ లో ఇండియా, పాకిస్థాన్ తో పాటు ఓ క్వాలిఫయర్ టీమ్ ఒక గ్రూపులో ఉన్నాయి. ఇక మరో గ్రూప్ లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫనిస్థాన్ ఉన్నాయి. ఇండియా టీమ్ ఎట్టిపరిస్థతుల్లోనూ పాకిస్తాన్ వెళ్లబోదని, టోర్నీని పాక్ నుంచి మరో చోటికి తరలిస్తామని ఏసీసీ చైర్మన్ హోదాలో జై షా చెప్పడం పాక్ క్రికెట్ బోర్డుకు మింగుడు పడలేదు. అప్పుడు పీసీబీ ఛైర్మన్ గా ఉన్న రమీజ్ రాజా.. దీనిపై మండిపడ్డారు. ఆసియా కప్ తరలిస్తే తాము ఇండియాలో జరగబోయో వన్డే వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేస్తామని కూడా హెచ్చరించారు.
కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ పై…
భారత్ పాక్ మ్యాచ్ కు రాహుల్ దూరమవుతారని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ గతంలో ప్రకటించారు. కేఎల్ రాహుల్ ప్రస్తుతం 100% ఫిట్ గా లేడు. అంటే అవును అనే చేప్పాలి ఇంకా పూర్తిగా ఫిట్ నెస్ కి తిరిగి రావాల్సి ఉంది. కీపింగ్ లో కఠోర సాధన చేసినా పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. అయితే రాహుల్ ఆటతీరు మెరుగుదల పట్ల జట్టు, వైద్య విభాగం సంతృప్తిగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.అదే విదంగా మూడు నెలల విరామం తర్వాత అయ్యర్ వెన్ను గాయంతో పూర్తిగా కోలుకున్నాడు.
భారత జట్టు…
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్పీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ. స్టాండ్ బై ప్లేయర్ సంజు శాంసన్. (IND)