Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 46వ AGM(Annual General Meeting) ఆగెస్ట్ 28న ముంబై లో జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ సంస్థ వృద్ధి ప్రణాళికలను రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ ప్రణాళికలలో ముఖ్యంగా జియో ఎయిర్ ఫైబర్ ను ప్రారంభించడం, జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ ద్వారా భీమా రంగంలోకి(Insurance) ప్రవేశించడం, 2026 నాటికి గిగా బ్యాటరీ ఫ్యాక్టరీ ను స్థాపించడం తో పాటుగా అనేక డిజిటల్ మరియు రిటైల్ వవ్యాపార విస్తరణకు సంబందించినవి ఉన్నాయి.
నీతా అంబానీ అవుట్, వారసులు ఇషా, అనంత్, ఆకాష్ ఇన్
ముకేశ్ అంబానీ వారసులైన ఇషా, ఆకాష్ అంబానీ మరియు అనంత్ అంబానీలు రిలయన్స్(reliance) బోర్డు లో డైరెక్టర్లుగా చేరనున్నారని, తన భార్య నీతా అంబానీ బోర్డు నుంచి వైదొలగనున్నారని తెలిపారు. అలాగే రిలయన్స్ సంస్థ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మరో 5 ఏళ్ళ పాటు తానే కొనసాగుతానని ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ ఏడాది వినాయక చవితి రోజున దేశ వ్యాప్తంగా జియో ఎయిర్ ఫైబర్(JIO AIR FIBER) సర్వీసులని ప్రారంభించనున్నట్టు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.
మరో 5 ఏళ్లలో 100 Compressed Bio Gas ప్లాంట్లు
దేశవ్యాప్తంగా వచ్చే 5 సంవత్సరాలలో 100 కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ల ద్వారా దాదాపుగా 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ అవశేషాల తో(Agricultural Residues) పాటుగా సేంద్రియ వ్యర్థాలను(Organic Waste) వినియోగించి 2.5 మిలియన్ టన్నుల సేంద్రియ ఎరువులను (Organic Manure) తయారు చేయనున్నామని, దీని ద్వారా 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను(Carbon Emissions) తగ్గిస్తామని, మరో 10 నెలల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకి లో రిలయన్స్ యొక్క మొదటి CBG ప్లాంటు ను ప్రారంభిస్తామని తెలిపారు.
30 మిల్లియన్లకు క్యూబిక్ మీటర్లకు పెరగనున్న KG BASIN గ్యాస్ ఉత్పత్తి
ప్రస్తుతం కృష్ణ – గోదావరి బేసిన్ (KG-D6) బ్లాక్ లో రోజుకు 20 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి రోజుకు 30 మిలియన్ క్యూబిక్ మీటర్లకు ఉత్పత్తిని పెంచనున్నామని, ఇది దేశంలోని గ్యాస్ ఉత్పత్తిలో 30 శాతంగా ఉంటుందని మరియు దేశంలోని గ్యాస్ వినియోగంలో 15% గా ఉంటుందని ముకేశ్ అంబానీ తెలిపారు. పెరిగిన గ్యాస్ ఉత్పత్తి ద్వారా ఏడాదికి $7 బిలియన్ డాలర్ల మేర గ్యాస్ దిగుమతిని తగ్గించి ఆదా చేయవచ్చని తెలిపారు.
గ్లోబల్ టాప్ 100లో రిలయన్స్ రిటైల్
ప్రపంచంలోని టాప్ 100 రిటైల్ కంపెనీలలో భారత దేశానికీ చెందిన ఏకైక రిటైల్ కంపెనీ రిలయన్స్ రిటైల్ ఏ అని మరియు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ సంస్థలలో ఒకటి అని తెలిపారు. ప్రస్తుతం భారత దేశం ప్రజల యొక్క తలసరి ఆదాయం $2500 గా ఉండగా అది మరో దశాబ్ద కాలంలో $10000 కు చేరుకుంటుందని, దీని ద్వారా దేశంARTలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో రిలయన్స్ రిటైల్ ఉంటుందని ముకేశ్ అంబానీ ఆశ భావం వ్యక్తం చేసారు.
భారత్ లోనే అతి పెద్ద డిజిటల్ ఓ టి టి గా జియో సినిమా
రిలయన్స్ కు చెందిన జియో సినిమా, ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ ల ఉచిత లైవ్ స్ట్రీమింగ్ ను దాదాపుగా 45 కోట్ల మంది వీక్షించారని తెలిపారు. జియో సినిమాలో క్రికెట్ తో పాటుగా అనేక రియాలిటీ షోలు, ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, HBO కు చెందిన అనేక బ్లాక్ బస్టర్ వెబ్సెరీస్ లు, సినిమా లు ఉన్నాయని. దీనితో జియో సినిమా భారత దేశంలోనే అతి పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీ గా మారిందని తెలిపారు.
Reliance AGM 2023 నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన షేర్ విలువ సోమవారం NSEలో 1.27 శాతం క్షీణించి రూ.2,436.95 వద్ద ముగిసింది.