శ్రావణమాసం…అందులో పెళ్లిళ్ల సీజన్.. ఇక పసిడి (gold) పరుగులను ఆపగలమా? ఎవరూ ఆపలేరు. డిమాండ్ ఎక్కువ. సప్లయ్ తక్కువ. ఉన్నబంగారాన్ని విక్రయించడానికి పైగా నగిషీలు చెక్కి మరీ మగువలను ఊరించే డిజైన్లు. దీంతో పసిడి (gold) కి బాగా డిమాండ్ ఏర్పడింది. శ్రావణమాసంతో పాటు రక్షాబంధన్ వంటి పండగలు కూడా రావడంతో జ్యుయలరీ (jewellery) దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడిపోతున్నాయి. రక్షా బంధన్ రోజున సోదరికి బంగారం గిఫ్ట్ గా ఇస్తేమంచిదని చెబుతుండటంతో గిరాకి మరింత పెరిగింది. గోల్డ్ బాండ్స్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో డిజిటల్ గోల్డ్ ను గిఫ్ట్ గా అనేక మంది ఇస్తున్నారు.
శ్రావణమాసం పైగా…
శ్రావణమాసం ప్రారంభమయిందంటే చాలు. ఇక మహిళలు పసిడి కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఇష్టపడతారు. లక్ష్మీదేవిని తాము కొన్న బంగారంతో అలంకరించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు జ్యుయలరీ దుకాణాలు గ్రాము నుంచి తులం వరకూ అనేక రూపాలలో గృహిణులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మహిళలు కూడా లక్ష్మీ కటాక్షం పొందాలన్న పేరుతో పసిడిని కొనుగోలు చేయడం సంప్రదాయంగా మార్చుకున్నారు. సంప్రదాయం పేరిట బంగారాన్ని తమ సొంతం చేసుకోవడానికి మగువలు ఇదొక ప్రయత్నంగా భావిస్తారు. అందుకే పసిడికి ఈసీజన్ లో ఇంతటి డిమాండ్.
మరింత పెరిగే… (gold)
సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయని ఎప్పటి నుంచో అంచనాలు వినపడుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల రూపాయలకు చేరుకుంటుందని కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పదేళ్ల క్రితం ఇరవై ఐదు వేల రూపాయలున్న బంగారం ధర నేడు రెట్టింపు కావడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఎక్కువ మంది కొనుగోలు చేయడం వల్ల కూడా డిమాండ్ పెరిగింది.
దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతులను తగ్గించడం, బడ్జెట్ సందర్భంగా కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల కూడా ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుుతన్నారు. అందుకే మరింత ధరలు పెరిగే అవకాశముందని భావించిన అనేక మంది ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకున్నారు.
భారీగానే పెరిగి… (gold)
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అలాగే కొన్నిరోజుల పాటు స్థిరంగా కొనసాగాయి. దీంతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశముందని భావించిన వారు పప్పులో కాలేసినట్లే. గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.
నిన్న పది గ్రాములపై రెండు వందల రూపాయలు పెరిగిన బంగారం ధర నేడు మూడు వందల రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం యాభై ఐదు వేల రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60 వేల రూపాయలుగా నమోదయింది. ఇక మార్కెట్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 80,700 రూపాయలు గా ట్రేడ్ అవుతుంది. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.