తెలుగు రాష్ట్రాల్లో రేపటినుంచి వర్షాలుపడే (Rain) అవకాశముందని వాతావరణ శాఖ (weather report) తెలిపింది. అయితే ఇవి సాధరణ వర్షాలే తప్ప భారీ వర్షాలు కాబోవు. ఆగస్టునెల అంతా దక్షిణాది రాష్ట్రాలను వర్షాభావం పట్టి పీడించింది. వాయవ్యం నుంచి వీచే పొడిగాలుల వల్ల ఎండలు దంచి కొట్టాయి.తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణుల వల్ల అప్పుడప్పుడు భారీవర్షాలు కురిశాయి.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు పట్టి కుదిపాయి. రుతుపవన ద్రోణి సరిగా కదలకపోవడంతో నైరుతీ రుతుపవనాలు దేశ వ్యప్తంగా సమానంగా విస్తరించకుండా మధ్యలోనే బలహీనపడిపోయాయి.
అందుకే వర్షాలు పడాల్సిన టైమ్ లో పడలేదు.. అయితే ఇప్పుడు ఈ రుతు పవన ద్రోణి ప్రభావం వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్ తొలివారం నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా.అయితే ఉభయ రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా వాతావరణ శాఖ చెబుతోంది.
హాంగ్ కాంగ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ( saola typhoon) (Rain)
సూపర్ సైక్లోన్ సావోలా( saola typhoon )ఫిలిప్పిన్స్ వైపు దూసుకు వస్తుండటంతో హాంగ్ కాంగ్ అప్రమత్తమైంది. అక్కడి ఆర్థిక పరమైన ఆస్తులన్నింటినీ రక్షించుకునే పనిలో పడింది. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ మార్కెట్ ను ముందు జాగ్రత్తగా మూసి వేశారు.
సైక్లోన్ సరిగ్గా ఎప్పుడు ప్రభావం చూపేదీ స్పష్టం చేయనప్పటికీ 8వ ప్రమాద హెచ్చరికను శుక్రవారం ఉదయం 7గంటలనుంచి మధ్యాహ్నం3.45 మధ్య గనక ఎగురవేస్తే మాత్రం తుఫాను తీవ్రత ఉండబోతోందని సంకేతమని అధికార వర్గాలు అంటున్నాయి. హాంగ్ కాంగ్ వ్యాపారాన్ని తుపాను దెబ్బ తీయడం ఈ ఏడాది ఇది రెండవ సారి.
హాంగ్ కాంగ్ అబ్జర్వేటరీ నివేదికల స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటలకు తుఫాను నగరానికి 450 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశగా కేంద్రీక్రు తమై ఉంది. దీని ప్రభావం ఈ శుక్రవారం , శనివారం హాంగ్ కాంగ్ నగరాన్ని తాకనుంది. దీని ప్రభావం వల్ల గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయవచ్చు.
ఈ సాయంత్రానికి టి3 తుపాను హెచ్చరికను హాంగ్ కాంగ్ అబ్జర్వేటరీ రిలీజ్ చేసే అవకాశముంది. తుఫాను వేగం మరింత పెరిగితే టీ8 సిగ్నల్ ను కూడా ఎగురవేసే ఆస్కారముంది. టీ8 సిగ్నల్ ఎగురవేస్తే స్కూళ్లు, ఆఫీసులు, ప్రజా రవాణాను మూసివేయాల్సివస్తుంది. హాంగ్ కాంగ్ లో తుఫాన్ల తీవ్రతను 1-10 స్కేల్ పై కొలుస్తారు.
చైనాలోనూ ప్రభావం (Rain)
మరోవైపు చైనా వాతావరణ శాఖ కూడా సావోలా తుఫానుపై అప్రమత్తమైంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎరుపు రంగు ప్రమాద సూచికను ఎగుర వేసింది. గాంగ్ డాంగ్ కు 295 వాయవ్య దిశన తుపాను కేంద్రీక్రుతమైంది.
ఇది మరింత తీవ్రమై దక్షిణ చైనా సముద్రం వైపుగా మళ్లుతుందని, గాంగ్ డాంగ్ తీరాన్ని తాకి బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను నేపధ్యంలో చైనా కొన్ని రైలు సర్వీసులను రద్దు చేసింది.
ఇక సావోలా తుఫాను దెబ్బకు తైవాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ప్రయాణికులకు ట్రావెల్ గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. తుఫాను ప్రభావంతో ఫిలిప్పీన్స్ లో దాదాపు 200 పట్టణాలు నీటమునిగాయి. దాదాపు 50 వేలమందిని సురక్షిత స్థావరాలకు తరలించల్సి వచ్చింది.