జనసేనాని పవన్ కల్యాణ్ (PK) 2024 ఎన్నికలలో గెలుపు కోసం చేస్తున్నప్రయత్నాలు, రచిస్తున్న వ్యూహాలు జనసేన (janasena) గెలుపుకి ఎలా కలిసొస్తాయో తెలీదు కానీ ఆయన చేస్తున్న విమర్శలు మాత్రం భవిష్యత్తులో సొంత పార్టీకే నష్టమనే భావనలు బలపడుతున్నాయి. తెలుగు సంస్క్రుతి, సంప్రదాయాల గురించి, మానవత్వం గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి, నీతిమంత రాజకీయాల గురించి పవన్ చెప్పే ఆసు కవిత్వం వినడం జనసేన కార్యకర్తలకు వినసొంపుగా ఉన్నా వైరి పక్షమైన వైసీపీకి మాత్రం కడుపు మంట కలిగిస్తున్నాయి.. నైతికత గురించి పదే పదే మాట్లాడుతూ పవన్(pavan)అనేక సార్లు టార్గెట్ అవుతున్నారు..
మళ్లీ అదే పాట… (PK)
రక్షా బంధన్ రోజు ఆడపడుచుల క్షేమం గురించి వర్రీ అవుతూ పవన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. మహిళలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు చెబుతూనే జగన్,(Jagan) చంద్రబాబు(chandrabababu) రాఖీలు కట్టించుకుని పండగ చేసుకుంటున్నారని కానీ ఏపీలో అద్రుశ్యమైన 30 వేలమంది మహిళల పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన , ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ 30 వేలమందిని వెతికి పట్టుకోవాలని పోలీస్ శాఖను కూడా కోరారు.అసలు ఏపీలో అద్రుశ్యమైన మహిళల సంఖ్య 30 వేలని పవన్ కు ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన అధికారిక వివరాలు సమర్పించకుండా గాలిలోమాటలు మాట్లాడుతూ రాజకీయం చేశారు. రాష్ట్రంలో అంతపెద్ద సంఖ్యలో మహిళలు మిస్ అవుతుంటే స్పందించి రాష్ట్రాన్ని వివరణ కోరాల్సింది కేంద్రం.. కానీ కేంద్రం ఈ విషయమే ఎక్కడా కామెంట్ చేయలేదు. పోనీ రాష్ట్రంలోనైనా ఈ అద్రుశ్యం వార్త కలకలం రేపాలి. నిజంగా అంతమంది అద్రుశ్యమే అయి ఉంటే ఈపాటికే అలజడి రేగేది. పోనీ ఇన్నాళ్లు ప్రభుత్వానికి భయపడి పోలీసు శాఖ నిజాలు దాస్తోంది అనుకున్నా.. ప్రతీ వారాహి బహిరంగ సభలోనూ పవన్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కాబట్టి నిజంగా అలాంటిదేదైనా ఉంటే ఈ పాటికే రాష్ట్ట్రం అల్లకల్లోలమయ్యేది.
బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్ల ముందు క్యూ కట్టేవి. ఇలాంటి దారుణాలను హక్కుల సంఘాలు, కమ్యూనిస్టులు అస్సలు వదిలిపెట్టరు. ఒకవేళ బీజేపీ, వైసీపీ లోపాయికారీ మద్దతు కాబట్టి ఈ విషయం బయటపడటం లేదు అనుకున్నా.. ఇక జాతీయ స్థాయిలో మానవ హక్కుల సంఘాలు, మహిళా కమిషన్ ఇలాంటి వ్యవహారాలను ఊరికే వదలవు. కచ్చితంగా పోరాడతాయి. మరి పవన్ ఎందుకీ వ్యాఖ్యలు పదేపదే చేస్తున్నారు? అసలు పవన్ కు ఈ సమాచారం ఇచ్చిన అధికారి ఎవరు? వారి పేరు ఎందుకు చెప్పరు? వాలంటీర్ల (volunteers) అద్రుశ్యం కథ పవన్ అల్లుతున్న కట్టు కథా? లేక దీని వెనకాల అలజడి రేపాలన్న ఉద్దేశాలున్నాయా అన్న సందేహాలను వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగు భాష పైనా అదే వరస… (PK)
తాజాగా మొన్న తెలుగు భాషా దినోత్సవం జరిగింది. ఆరోజునా పవన్ సోషల్ మీడియాలో గిడుగు (gidugu) రామ్మూర్తి పంతులు భాషోద్ధరణకు చేసిన ప్రయత్నాన్ని కొనియాడి నివాళులు అర్పించారు. అంతవరకూ ఓకే.. కానీ ఆ తర్వాతే యధాప్రకారం జగన్ ప్రభుత్వం మీద దాడి చేశారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల వల్ల భాషకు రక్షణ లేదని, ప్రభుత్వానికి అసలు పెద్దలంటే గౌరవం లేదనీ ఏవో ఇన్ డైరక్ట్ గా అన్నారు.
పవన్ ఇలా అన్నారో లేదో వైసీపీ మళ్లీ అందుకుంది.. పవన్ కల్యాణ్ భాషగురించి మాట్లాడితే బాగోదని విమర్శించింది. పవన్ కు భాష మీద అంత అభిమానముంటే ముందు తన పిల్లలకు తెలుగు భాష నేర్పాలని, వారిని తెలుగు మీడియం స్కూల్లో చదివించాలని సవాల్ విసిరింది. పవన్ తన పిల్లలకు మాత్రం ఇంగ్టీషు మీడియంలో చదువు .. రాష్ట్రంలో దిగువ మధ్య తరగతి వారు మాత్రం ఇంగ్టీష్ నేర్చుకోకూడదా అని రివర్స్ అయ్యింది.
ఏదేమైనా పవన్ రెచ్చగొట్టుడు రాజకీయం పట్ల వైసీపీ నేతలే కాదు కామన్ పబ్లిక్ కూడా చిరాకు పడుతున్నారు. అధికారంలో ఉన్న వాడిని ఆడిపోసుకోవడం తప్ప తానేం చేస్తాడో చెప్పకపోవడం పట్ల అసహనంతో ఉన్నారు.పవన్ బహిరంగ సభల్లో వర్ణించినంత దారుణమైన పరిస్థితులైతే ఏపీలో లేవని సామాన్యులే అంగీకరిస్తున్నారు. దిగువ మధ్యతరగతి హాయిగా దర్జాగా బతుకుతోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పట్ల సంత్రుప్తిగా ఉంది.
ఎన్నికల్లో ఈ ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంటుంది కాబట్టి ఎటు తిరిగి ఏమైనా తమ గెలుపు ఈసారికి ఖాయమేనని వైసీపీ కూడా ధీమాగా ఉంది.. అయితే ఇప్పటి వరకూ పోటీకి ఎమ్మెల్యే అభ్యర్ధులు కాదు..కనీసం పార్టీ కేడర్ నిర్మాణమే లేని జనసేన ఈ ఎన్నికల్లో ఏం చేయాలనుకుంటోంది? ఓట్లు చీలనివ్వం అంటూ అటు టీడీపీతోనూ, ఇటు బీజేపీ పైనా వాలేసి ఈసారికి కానిచ్చేద్దాం అనుకుంటోందా?పవన్ కల్యాణ్ లాగే ఆయన అభిమానులు కూడా ఆవేశపరులు కావడంతోనే అసలు సమస్య వస్తోంది.
వ్యూహరచన అంటే అదేనా?(strategy politics)
వ్యూహరచన అంటే రెచ్చగొట్టుడు రాజకీయం కాదు.ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో స్నేహం చేసి ఎన్నికల బరిలోకి దిగడం కాదు. దిగువ మధ్య తరగతి ఓటు బ్యాంకు బలంగా కలిగిన జగన్ పై తీవ్రమైన విమర్శలు చేయడం,తూలనాడటం, ఏకవచనంతో సంభోదించడం, జుట్టుఎగరేసి ఆవేశపడటం అసలే కాదు..అసలు జగన్ ను ఎంత తిడితే అంత ఫేమస్ అవుతామని జనసేనాని అనుకుంటున్నారా? ఇదే నిజమైతే తన గొయ్యి తనే తవ్వుకుంటున్నట్లు లెక్క. వారాహి ఎక్కినది మొదలు జగన్ భజన చేయడం ,తిట్టడం తప్ప ఈ మధ్య పవన్ ప్రసంగాల్లో మరేం కనిపించడం లేదు.పదే పదే జగన్ ను విమర్శించడం ద్వారా జగన్ కు మరింత ప్రచారం జనసేనానే కల్పిస్తున్నారు.. వ్యూహ రచన అంటే ఒక స్థిరమైన, నమ్మకమైన, సిద్ధాంతపరమైన, అభివ్రుద్ధి కాంక్షతో రాజకీయం చేయడం అని జనసేన ఎప్పటికి తెలుసుకుంటుందో?