ప్రపంచ ఛాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా(Neeraj chopra) మంచి జోరు మీద ఉన్నాడు.. బుడాపెస్ట్ లో (Budapest)సాధించిన విజయం తర్వాత ఇప్పుడు ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ లో (Diamond league) స్వర్ణ పతకంపై గురిపెట్టాడు.
జ్యూరిచ్ (Zurich) లో జరుగుతున్న డైమండ్ లీగ్ లోనూ జైత్రయాత్ర కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. జ్యూరిచ్ లో జరిగేడైమండ్ లీగ్ లో పదిమంది జావెలిన్ త్రో ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. వీరిలో భారత్ నుంచే మురళీ శ్రీశంకర్ కూడా బరిలో నిలిచాడు. ఈ లీగ్ లో గెలిస్తే నీరజ్ హ్యాట్రిక్ కొట్టినట్లే.
డైమండ్ లీగ్ ఫైనల్ పోటీలు యూజెన్ లో సెప్టెంబర్ 16,17 తేదీల్లో జరుగుతున్నాయి. వాల్డ్ ఛాంపియన్ షిప్స్ పోటీల్లో గెలవాలని తాను ఉవ్విళ్లూరుతున్నట్లు అయితే భుజానికి ఉన్న గాయం రేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నీరజ్ (Neeraj chopra) తెలిపాడు.
తాను ఇప్పటి వరకూ గెలవనిది వాల్డ్ ఛాంపియన్ షిప్ మాత్రమేనని, టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచినట్లు నీరజ్ కామెంట్ చేశాడు.ప్రస్తుతం జ్యూరిచ్ లో 90మీటర్ల త్రో పై గురి పెట్టినట్లు.. రాబోయే పోటీల్లో ఈ దూరాన్ని మరింత పెంచుతాననీ అన్నాడు.
ఇటీవల బుడాపెస్ట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో జావెలిన్ ను 88.17 మీటర్ల దూరం విసిరిన నీరజ్ స్వర్ణంతో సత్తాచాటాడు. ఇక దాయాది పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి నీరజ్ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. రజత పతకం గెలిచి తొలిసారి పాక్ కు మెడల్ అందించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
జావెలిన్ చరిత్రలో ఒలింపిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకాలు సాధించిన మూడో ఆటగాడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. నీరజ్ కంటే ముందు ప్రపంచ రికార్డు గ్రహేత జాన్ జెలెజ్నీ ఆండ్రియాస్ తోర్కిల్డ్ సెన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇప్పటి వరకు 19 సార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి.
అదే రికార్డును కొనసాగిస్తున్నాడు..
25 ఏళ్ల నీరజ్ ఈ సీజన్ డైమండ్ లీగ్ లో అదే రికార్డును కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది దోహా, లౌసానే లీగ్ లలో అగ్రస్థానాలు సాధించాడు.
అనంతరం ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం నెగ్గిన జాకబ్ వాడ్లెజ్ జూనియర్ వెబెర్ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్ తో డైమండ్ లీగ్ లో నీరజ్ కు పోటీ ఎదురుకానుంది. బుడా పెస్ట్ లో రజతం గెలిచిన అర్షద్ నదీమ్ జ్యురిచ్ టోర్నీకి దూరంగా ఉన్నాడు.
2027 ప్రపంచ అథ్లెటిక్స్ కు భారత్ బిడ్డింగ్…
భారత్ 2027 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ కు మనదేశం ఈసారి బిడ్డింగ్ వేస్తోంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ప్ కు ఆతిధ్యం ఇవ్వడం అంటే ప్రపంచ క్రీడాపటంలో మన దేశం ఖ్యాతి ఇనుమడింప చేయడమే.
అందుకే భారత్ ప్రయత్నాన్ని నీరజ్ చోప్రా సమర్ధించాడు. భారత్ బిడ్డింగ్ వేస్తోంది.. కాబట్టి ఆటలను చూసేందుకు పెద్ద ఎత్తున అందరూ తరలి రావాలి అని నీరజ్ తన అభిమానులకు అపీల్ చేశాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్యకు ప్రభుత్వ అనుమతి అవసరం ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఏఎఫ్ ఐ ఇంకా సంప్రదించలేదు. బిడ్ దరఖాస్తు ఫామ్ ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబరు 2. 2027 అథ్లెటికే ప్రకటించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పతకాల పట్టికలో భారత్ 18 స్థానంలో నిలిచింది.