Karnataka: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టటం కోసం కాంగ్రెస్ పార్టీ 5 కీలకమైన హామీలను ఇచ్చింది. వాటిలో అత్యంత ముఖ్యమైన గృహ లక్ష్మి (Gruha Lakshmi) పథకాన్ని ఆగెస్ట్ 30న మైసూరు లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. Direct Benefit Transfer(DBT) ద్వారా రాష్ట్రంలోని గృహ లక్ష్మి యోజన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా నగదును జమ చేసారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య తో పాటుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు.
గృహ లక్ష్మి పథకం
గృహ లక్ష్మి పథకం కింద కర్ణాటక లోని Below Poverty Line (BPL) రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలలోని మహిళలకు నెలకు ₹2000 చొప్పున ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం కేవలం కుటుంబంలోని ఒక మహిళకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా కర్ణాటకలోని 1.28 కోట్ల మంది మహిళలకు నెలకు ₹2000 వారి బ్యాంకు ఖాతాలలో జమ కానుంది. ఈ పథకం కొరకు దాదాపుగా ₹32,000 కోట్ల రూపాయలను కర్ణాటక ప్రభుత్వం ఖర్చు చేసింది.
పథకంలోని నిభందనలు
ఇంటిలోని మహిళ యొక్క భర్త ఆదాయపు పన్ను చెల్లింపుదారుడైతే ఈ పథకం వారికి వర్తించదు. అలాగే కర్ణాటక రాష్ట్రము లోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కొరకు అంత్యోదయ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ తో లింక్ చేయబడిన మొబైల్ ఫోన్ నెంబర్ వంటి వివరాలను అధికారులకు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది.
గృహ లక్ష్మి పథకం రెజిస్ట్రేషన్ కొరకు డాక్యూమెంట్లను ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్లో కూడా సమర్పించవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్కు సంబందించిన పూర్తి వివరాలను గృహ లక్ష్మి (https://gruhalakshmischeme.info/) వెబ్ పోర్టల్లో పొందవచ్చు.
కాంగ్రెస్ విజయానికి కారణమైన ఆ 5 హామీలు ఇవే
కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా 5 హామీలను ప్రకటించింది.
- రాష్ట్రంలోని ప్రతి ఇంటికి గృహ జ్యోతి (Gruha Jyoti) పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది.
- గృహ లక్ష్మి (Gruha Lakshmi) పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు నెలకు ₹2,000 సహాయాన్ని అందిస్తారు.
- రాష్ట్రంలోని BPL కార్డు కలిగిన ప్రతి ఇంటి సభ్యునికి అన్న భాగ్య పథకం కింద నెలకు 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తారు.
- రాష్ట్రంలోని మహిళలకు KSRTC (కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్) బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం.
- గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న యువకులకు ప్రతి నెల ₹3,000 నిరుద్యోగ భృతి అందిచడం మరియు డిప్లొమా చేసి నిరుద్యోగులుగా ఉన్న యువకులకు యువ నిధి పథకం కింద నెలకు ₹1,500 రెండేళ్లపాటు అందిస్తామని హామీ ఇచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా గృహ లక్ష్మి హామీని కూడా అమలు చేసింది. మిగిలిన మూడు హామీలను కూడా మరో సంవత్సరంలో అమలు చేస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
VIDEO | Congress chief Mallikarjun Kharge, party leader Rahul Gandhi, Karnataka CM CM Siddaramaiah attend the launch of 'Gruha Lakshmi' scheme in Mysuru. pic.twitter.com/6WIUMQFMyp
— Press Trust of India (@PTI_News) August 30, 2023