ఏపీలో ఎన్నికల ముంగిట్లో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై (CBN) అవినీతి ఆరోపణలు(Scam) సంచలనంగా మారాయి. అసలే టీడీపీకి ఏపీలో గడ్డు పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో ఈ ఆరోపణలు మరింత ఇరకాటంలో పడేసేవిగా ఉన్నాయి.
2020-2021 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబుకు చెందిన రూ.118,98,13,2071 సొమ్మును అక్రమ సంపాదనగా గుర్తించిన ఐటీ శాఖ ఆయనకు ఆమేరకు వివరాలివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే ఆనోటీసులకు ఆగస్టు 4న చంద్రబాబు ఇచ్చిన సమాధానాన్నిఆర్ధిక శాఖ తిరస్కరించింది. తాజాగా ముడుపుల స్కామ్ గా అనుమానిస్తూ చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి.
షాపోర్ జీ పల్లోంజికాంట్రాక్టర్లు (CBN)
మరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జి పల్లోంజి(SPCL),ఎల్ అండ్ టీ సంస్థలనుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ. 118 కోట్ల ముడుపులు ముట్టాయని ఐటీ శాఖ ఆరోపిస్తోంది. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటీ శాఖ ఆరోపించింది. దీనికి సంబంధించిన ప్రాధమిక ఆధారాలను సైతం ఆదాయపన్ను శాఖ అధికారులు సేకరించారు.
షాపూర్ జీ పల్లోంజి కంపెనీకి అక్రమంగా కేటాయించిన కాంట్రాక్టుల తాలూకా దొంగ ఇన్ వాయిస్ లను,మనోజ్ వాసుదేవ పార్ధసాని అనే వ్యక్తి స్రుష్టించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. మనోజ్ వాసుదేవ్ పార్ధసాని ఇంట్లో సోదాల సమయంలో డబ్బును ఎలా మ్యానిపులేట్ చేసి ఇచ్చారన్న వివరాలతో కూడిన డాక్యుమెంట్లు ఐటీ శాఖ చేతికి చిక్కాయి.
2017-2019 వరకూ మనోజ్ వాసుదేవ పార్ధసాని అన్న వ్యక్తే కాంట్రాక్టులను ఎలా, ఎప్పుడు ఎన్ని తీసుకున్నదీ, దానికి సంబంధించిన సొమ్మును ఎలా మార్చి చంద్రబాబు ఖాతాలోకి చేర్చింది స్వయంగా స్టేట్ మెంట్లో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ కూడా సమర్ధించినట్లు ఐటీ శాఖ దగ్గర ఆధారాలున్నాయి.
మనోజ్ పార్ధసాని ద్వారానే ముడుపులు బాబు సెక్రటరీకి చేరినట్లు రికార్డుల్లో తేలింది. ఇది అక్రమ సంపాదన ఎందుకు అవకూడదంటూ ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులిచ్చింది. అయితే తనకు నోటీసులు ఇవ్వడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఒప్పుకున్నారు కూడా. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన రూ. 118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది ఐటీ శాఖ.
2019లోనే మనోజ్ ఇంట్లో సోదాలు (CBN)
మొదటగా ఐటీ శాఖ షాపోర్ జీ పల్లోంజి కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో 2019లోనే సోదాలు జరిపింది. అక్కడే ఈ మొత్తం సమాచారం దొరికింది. ఆ తర్వాత 2020ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ నివాసంలో సోదాలు చేశారు. దాంతో పూర్తి సమాచారం ఐటీ శాఖ అధికారులకు దొరికింది. ఈసమాచారాన్ని మొత్తం క్రోడీకరించి పరిశీలించాక ఐటీ శాఖ రిపోర్ట్ ను తయారు చేసింది.
ఈ సమాచారం ఆధారంగానే సంబంధిత వ్యక్తులను పిలిపించి వారికి ఆఆధారాలు చూపించి వారి స్టేట్మెంట్లను కూడారి కార్డు చేశారు. సంబంధిత వ్యక్తుల వివరణలను తీసుకుని సంతకాలు తీసుకున్నాకే చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు పంపారు.
అమరావతి నిర్మాణాల కాంట్రాక్టుల ద్వారానే
షాపోర్జీ పల్లోంజి కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హై కోర్టు,అసెంబ్లీ సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణం , రాజధానిలో ఇతర నిర్మాణ పనులు కలిపి 2018 నాటికి 8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టు పనులు చేపట్టింది. ఈ పనులకు సబ్ కాంట్రాక్టుల కింద మరో రెండు కంపెనీలను స్రుష్టించి వాటికి బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇచ్చినట్లు ఐటీశాఖ ఆరోపిస్తోంది.
అమిత్ షా ని కలిసింది ఇందుకా?
తాను నిప్పని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చిన్న అవినీతి మరక కూడా లేదని పదే పదే చెప్పే చంద్రబాబుకు 2024 ఎన్నికలముందు ఈ ఆరోపణలు రావడం పెద్ద తలనొప్పే.. వాస్తవానికి జూన్ నెలలోనే చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిశారు. అప్పట్లో రాజకీయ సమీకరణల రీత్యా.. ఎన్డీఏ కూటమికి దగ్గరవడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, పొత్తులకోసం మాట్లాడేందుకే అమిత్షాను కలిశారనీ ఆ పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. కానీ తెరవెనుక కారణాలివేనని తెలుస్తోంది. తాజా ఆరోపణలు టీడీపీతో కలసి ఎన్నికలకు వెళదామనుకున్న జనసేనకు కూడా తలనొప్పే.. వైసీపీ అవినీతి ప్రభుత్వం అంటూ పదే పదే విమర్శలు చేసే జనసేనకి టీడీపీతో పొత్తు పై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.