జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు ? TDP-BJP
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా.? నటనలో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం పుణికిపుచ్చుకున్న తారక్ ఎప్పటికైనా తెలుగుదేశంకు నాయకత్వం వహించాలని ఆ పార్టీలోని పలువురు ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చీలిక తెచ్చి తద్వారా ఏపీ రాజకీయాల్లో బీజేపీ పార్టీకి స్పేస్ క్రియేట్ చెయ్యాలని బీజేపీ భావిస్తుందా.? చంద్రబాబు నాయుడు ఆయన పీఎస్ శ్రీనివాస్ తో సహా కొందరికి ఐటీ నోటీసులు జారీ చేయడంలో ఇదే వ్యూహమా.? టీడీపీలో స్పష్టమైన చీలిక సృష్టిస్తే తప్ప ఏపీ రాజకియాల్లో బీజేపీకి సుస్తిర స్థానం లభించదని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ఏపీ పార్టీ పగ్గాలు ఇవ్వడం వెనుక వ్యూహం ఇదేనేమో.! TDP-BJP
ఒకే దెబ్బకు పురందేశ్వరి స్వకార్యం, బీజేపీ స్వామికార్యం. నిజానికి బిజెపి కన్ను జూనియర్ ఎన్టీ ఆర్ పై ఎప్పుడే పడింది. కొద్ది నెలల క్రిత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. ట్లిపులార్ సినిమాలో ఆయన నటనను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తారక్ ను బిజెపిలోకి ఆహ్వనించినట్టు వార్తలు వచ్చాయి. సందర్భం చూసుకుని పురందేశ్వరి ద్వారా జూనియర్ ఎన్టీ ఆర్ ను రంగంలోకి దించి తెలుగుదేశం పార్టీల సునామీ తెచ్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందా..
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 70వ పడిలో పడినందున తెలుగుదేశంకు యువ నాయకత్వం అవసరమని అందరూ భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఒక వేదికపై చేర్చేందుకు పురందేశ్వరి ప్రయత్నించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపినప్పటికి జూనియర్ ఎన్టిఆర్ హాజరు కాలేదు. షూటింగ్ ఉందనే నెపంతో గైర్హాజరయ్యారు.
ఇందుకు పురందేశ్వరి ఆవేదన చెందారు. సీనియర్ ఎన్టిఆర్ కు మనవడు తారక్ అంటే ఎంతో ప్రేమ అని, ఆయన వారసుడు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తన తండ్రి సొంత కుమారుల కంటే తారక్ ను ఎంతగానో ప్రేమించారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కనుక బతికి ఉంటే తారక్ ను తన రాజకీయ వారసుడిగా టీడీపీ పగ్గాలు అప్పగించే వారని ఆమె సూచించారు.
TDP-BJP
జూనియర్ ఎన్టిఆర్ తెలుగుదేశంలోకి వస్తే మంచిదేనని ఒక టీవి ఇంటర్వ్యూలో పురందేశ్వరి చెప్పారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేశ్ గ్లామర్ తెలుగుదేశాన్ని, జగన్ పార్టీకి ధీటుగా నిలిపేందుకు సరిపోదని పార్టీలో పలువురి అభిప్రాయం. ఫిలడెల్ఫియాలో జరిగిన తానా సభలో తారక్ తెలుగుదేశం పగ్గాలు చేపట్టాలని ఆయన అభిమానులు కొందరు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి దించారు.
ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో తారక్ తో తెలుగుదేశం సంబందాలు తాత్కాలికంగా తెగిపోయాయి. పురందేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికి ఎన్టీఆర్ కుటుంబ ఆస్తి అయిన తెలుగుదేశం అంతరించిపోకూడదనే ఆలోచనతో ఉన్నారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబుతో పాత పగలు తీర్చుకునేందుకు బీజేపీ ఆమెకు ఒక అవకాశం కల్పించిందా… ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు తెలుగుదేశంను నిట్ట నిలువుగా చీల్చినట్టు ఇప్పటి పార్టీని చీల్చాలని బీజేపీ పన్నాగం. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను చీలిక వర్గం నేతగా తీసుకురావాలనేది బీజేపీ ఆలోచన.
ఇటీవల కాలంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చిన నమూనాను ఏపీలో అమలు చేయాలనేది బీజేపీ వ్యూహం కావొచ్చు.
చంద్రబాబుకు ఐటీ నోటీసులు రావడంతో వైఎస్సార్ సీపీ మీడియా సెల్ రెచ్చిపోయింది. చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ ఈ వ్యవహారంపై మౌనం వహించింది. జనసేన పార్టీ దాని అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై పెదవి విప్పలేదు. బీజేపీతో ఉన్న మొహమాటం ఇందుకు కారణం కావొచ్చు.