భారత్ పాకిస్థాన్ మ్యాచ్ (ind vs Pak) లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని అందరు అసక్తిగా ఎదురు చూస్తు ఉంటారు. అసలే ఈ మధ్యన వన్డే ఫార్మాట్ లోనెంబర్ వన్ గా ఉన్న పాకిస్థాన్ తో తలపడటం అంటే అంత ఈజీకాదు. మైండ్ గేమ్ తో మైదానంలో భారత ఆటగాళ్లను ఇబ్బందిపెట్టే పాకిస్థాన్ ఇప్పటికే భారత్ జట్టులో పెద్ద ఆటగాళ్లెవరూ లేరని పెదవి విరిచింది. దాయాదుల మధ్య పోరంటే నరాలు తెగే టెన్షన్ కామన్..
ఇద్దరిలోఎవరు టాస్ గెలిచినా ఫీల్డింగే ఎంచుకుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే..
సాధారణంగా ఛేజింగ్ కు వీలుగా ఉంటుందని టాన్ గెలిచిన వారు ఫీల్డింగ్ ఎంచుకుంటూ ఉంటారు.
ఇక జట్ల బలా బలాల విషయానికొస్తే.. పాకిస్థాన్ బౌలింగ్ పరంగా చాలా గట్టిగా ఉంది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, ఇమాముల్ హక్ ఇద్దరూ మంచి జోడి.. భారీ లక్ష్యానికి మంచి పునాదులు వేయగల దిట్టలు. ఛేజింగ్ టార్గెట్ సాధ్యమైనంత ఎక్కువ పెట్టాలన్న లక్ష్యంతోనే పాకిస్థాన్ ఆడుతుంది. ఇక భారత్ విషయానికొస్తే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీల పైనే మొత్తం భారం పడనుంది. బౌలింగ్ లో మహమ్మద్ షమ్మీ, బూమ్రా పైనే అందరి ఆశలూ ఉన్నాయి. జట్టులో సీనియర్లు ఇద్దరే ఉండటం,మిగిలిన వారందరూ యువకులు కావడంతో భారం మొత్తం కొహ్లీ, రోహిత్ లపైనే ఉండబోతోంది. ఆసియాకప్ లో ఇప్పటికే నేపాల్ తో ఒక మ్యాచ్ గెలిచి మంచి జోరులో పాక్ జట్టు ఉంది. భారత్ కు ఇదే మొదలు.. అందులోనూ పాకిస్థాన్ తోనే మొదటి మ్యాచ్ కావడం తో భారత్ కు ఇది ప్రతిష్టాత్మక మ్యాచ్ గా మారబోతోంది. గాయాలతో సతమతమవతున్న కేఎల్ రాహుల్ రేపు ఆడతాడా లేదా అన్నది సందేహమే.రాహుల్ ని తప్పిస్తే ఆతని స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్ ను తీసుకునే అవకాశం ఉంది.
పాక్ కి బౌలింగే బలం:కొహ్లీ
పాకిస్థాన్ బౌలింగ్ పటిష్టంగా ఉందని విరాట్ కొహ్లీ అన్నాడు. పాక్ బలం బౌలింగే. ఏ సమయంలో నైనా మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే నైపుణ్యం ఆ జట్టు బౌలర్లకు ఉంది.
ఇలాంటి బౌలర్లను ఎదుర్కొవాలంటే అత్యుత్తమంగా రాణించాల్సి ఉంటుంది అని కొహ్లీ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ ను ఢీ కొట్టాలంటే మన బ్యాట్స్ మెన్ విజృంభించి ఆడక తప్పదు.
టాసే కీలకం..
భారత్ తో జరుగుతున్న ఆసియా కప్ లో ఎవరు టాస్ గెలుస్తారు. అని ఇప్పటికే చాలా ఉత్కంఠగా ఎదురు చుస్తున్నారు.
శ్రీలంకలోని కాండీ వేదికగా ఈమ్యాచ్ జరగనుంది. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కు ముందు భారత జట్టును టార్గెట్ చేస్తూ పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలకా వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్ జట్టులో రోహిత్ శర్మ, విరట్ కోహ్లి మినహా అంత గొప్ప ఆటగాళ్లు లేరని భట్ మరోసారి విషం చిమ్మాడు.
ఎవరెవరు ఎప్పుడు గెలిచారు?
ఆసియా కప్ లో ఇప్పటివరకు ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య 17 సార్లు పోట్టి పడ్డారు. మొదటి ఆసియా కప్ 1984లో జరగ్గా ఆ సీజన్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1988 లో పాక్ పై గెలిచిన భారత్..
దాయాది దేశంపై మరో సారి విజయం సాధించేందుకు దాదాపు 20 ఏళ్లు పట్టింది. 2010 నుంచి 2022 వరకు ఎనిమిదిసార్లు పోట్టి పడగా టీమ్ ఇండియా ఏకంగా ఆరు సార్లు విజయం సాధించింది.
టీ20 ఫార్మాట్ లో జరిగిన 2016 ఆసియా కప్ లో పాక్ ని భారత్ 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. 2018లో ఇరు జట్లు రెండుసార్లు తలపడగా… రెండింటిలోనూ విజయం సాధించి టీమ్ ఇండియా హ్యాట్రిక్ కొట్టింది.
(ind vs Pak)
పాకిస్థానుతో అంత ఈజీ కాదు..
పాకిస్థాన్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెం1 జట్టుగా కొనసాగుతోంది. పాక్ ఆడిన చివర 10 వన్డేల్లో 8 మ్యాచ్ల్ ల్లో విజయం సాధించింది.