అడేది ఆరు దేశాలే అయితే అభిమానులు ఎదురు చూసేది భారత్ -పాకిస్థాన్ IND vs PAK మ్యాచ్ కోసమే. దాయాదులు పోటీ పడితే ప్రేక్షకులతోపాటు మైదానంలో దిగే ఆటగాళ్లలోనూ టెన్షనే . గతంలోను పాక్ భారత్ మధ్య ఎనో మ్యాచ్ లు జరిగాయి. అయితే మ్యాచ్ లు కాస్త రసవత్తరంగా మారే కొద్దీ ఆటగాళ్ల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకోవడం సహజం.. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ మాత్రం ఒక యుద్ధమే. అలాగే ఈ రోజు పోరులో ఏం జరుగుతుంది అని అందరు ఎదురు చుస్తూ ఉంటారు.
హైవోల్టేజ్ : IND vs PAK
ఇవాల్టి ఇండో పాక్ మ్యాచ్ పై రెండుదేశాల్లోనూ హై ఓల్టేజ్ వాతావరణమే కనిపిస్తోంది. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ,గెలుపు ఖాయమని తేల్చేశాడు. “మేము జూలై నుంచి శ్రీలంకలో ఉన్నాము .. ఇప్పటికే లంకతో టెస్టు సిరీస్ లో తలపడ్డాం. ఆతరువాత లంకలో జరిగిన ఎల్ పి ఎల్ లో చాలా మంది ఇక్కడే ప్రీమియర్ లీగ్ కూడా ఆడేరు. అలాగే ఇక్కడే ఆఫ్గాన్ తో వన్డే సిరీస్ కూడా ఆడాం కాబట్టి లంక పిచ్ లను బాగా ఆర్ధం చేసుకున్నాము. ఎందుకంటే మా జట్టులో అనుభవజ్ఞలైన ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ అనుభవంతో భారత్ పై కూడా మెరుగ్గా రాణిస్తాం” అని చెప్పుకొచ్చాడు. హారిస్ రవూఫ్ పాకిస్థాన్ ఆటగాళ్లలో బలమైన బౌలర్ కావడం ఆ టీమ్ కు ఉన్న ప్లస్ పాయింట్.
ఇద్దరిపైనే భారం…
ఇక భారత జట్టు విషయానికొస్తే విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మే జట్టుకు ప్రధాన బలం.
వీరిద్దరి పైనే మొత్తం జట్టు పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంది. పాకిస్థాన్ బౌలర్ రవూఫ్ ను ఎదుర్కొనడం భారత్ కు కొంత సవాలే.
అయితే టీ20 ప్రపంచకప్ 2022 లో మెగా టోర్ని మ్యాచ్ లో రవూఫ్ కు కోహ్లి చుక్కలు చూపించాడు.
అతడు వేసిన 19వ ఓవర్ లో వరుసగా రెండు అద్భుతమైన సిక్స్ లు బాదిన విరాట్.. మ్యాచ్ రూపాన్ని మార్చేశాడు.
మరీ ముఖ్యంగా అతని తలమీదుగా విరాట్ కొట్టిన సిక్సర్ ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఇదే సీన్ ఇవాల్టి మ్యాచ్ లో మళ్లీ రిపీట్ అవ్వాలి అని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే విరాట్ కొహ్లీ వెళ్లి రవూఫ్ ను కలవడం విశేషం..
మ్యాచ్ కు కేఎల్ రాహుల్ దూరం..
అయితే ఈ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ కి గాయం కారణంగా భారత్ తప్పకుండా జట్టులో ఉన్న మరో కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు అవకాశం కల్పించింది.
ఇక టీ20 లో ర్యాంకులలో నెంబర్ వన్ స్థానం లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలలో మాత్రం సరిగా రాణించలేకపోవడంతో అతనికి పాకిస్థాన్ తో మ్యాచ్ లో అవకాశం దక్కలేదు.
వర్షగండం. IND vs PAK
భారత్ పాక్ ఆసియాకప్ 2023 హోరాహోరీ మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తుంటారు.
అయితే అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశం ఉంది.
ఈ రోజు ఉదయం కూడా క్యాండీలో భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది.