అసలు త్రిమూర్తులు అంటే ఎవరు..?
హైందవ మత పురాణాల ప్రకారం త్రిమూర్తులు(Trinity Gods) అనగా ముగ్గురు దేవుళ్ళు. త్రిమూర్తులు అంటే ఎవరు..?వారి పేర్లేంటో తెలుసుకుందామా..వారు మొదటగా ఆది దేవుడు సృష్టికర్త బ్రహ్మ, తరువాత సృష్టి పాలకుడు శ్రీ మహా విష్ణువు,అంత్య దేవుడు సృష్టికర్త , స్థితికారకుడు మరియు లయ కారకుడు అయినా పరమశివుడు. త్రిమూర్తులు(Trinity Gods) అంటే బ్రహ్మ(Lord Brahma) విష్ణు(Lord Vishnu) మహేశ్వరులు(Lord Siva) అనమాట.
వీరిలో శ్రీ మహా విష్ణువు(Lord Vishnu) ని పరమశివుడు ని భక్తి తో ఎంతో శ్రద్ధ తో కొలిచే ప్రజలు బ్రహ్మ కు మాత్రం ఎలాంటి పూజలు చెయ్యరు. త్రిమూర్తులను కలిపి పూజిస్తే ఎలాంటి దోషం ఉందంటారు పెద్దలు. ఇలా చేసే పూజ నే త్రిమూర్తి వ్రతం అని లేదా త్రినాధ వ్రతము అని అంటారు. అసలు బ్రహ్మ దేవుని కి ఆలయాలు కూడా ఎక్కడ కనిపించవు.ఒక్క భారత దేశం లో కాదు యావత్ ప్రపంచం మొత్తం మీద లేదనే చెప్పాలి. ఒకవేళ ఉన్న ఏదో ఒకటి అరా ఉండటమే తప్ప భక్తులు అంత వెళ్లి పూజ చేసుకునేంతటి ఆలయాలు మన భారతదేశం లో ఎక్కడ లేవు.
మహా విష్ణువు కు కానీ పరమశివుని కి కానీ వేరు వేరు గా అనేక ఆలయాలు ఉన్నాయి.విష్షును ఆలయం లేకుండా శివుని ఆలయం లేకుండా ఏ ఊరు ఉండదు అది మన అందరికి తెలిసిందే. కొన్ని ప్రదేశంలోని ఆలయాల్లో విష్ణు మహేశ్వరులు ఇద్దరు కొలువై ఉంటారు. అలంటి ఆలయాలకు ఎంతో ప్రత్యేకత కూడా ఉంటుంది. శివ కేశవుల దర్శనం సర్వ పాపహరణం అంటారు పెద్దలు.ఈ ఇద్దరు కొలువై ఉన్న ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎక్కడైనా త్రిమూర్తులు(Trinity Gods) ఒకే ఆలయం లో కొలువై ఉండటం చూసారా..?
కానీ ఎక్కడైనా త్రిమూర్తులు ఒకే ఆలయం లో కొలువై ఉండటం చూసారా..?
ఇలాంటి ఒక దేవాలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి లో ఉంది.ఇక్కడ పరమ శివుడు ‘ముఘ్దేశ్వర్’ అని, అమ్మవారు ‘సౌందర్యవల్లి’ గా కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఓ స్థలపురాణం కూడా ఉంది. ఈ ఆలయం గురించి పురాణాలు ఎం చెబుతానయి అంటే ఆదిశేషుడు వాయు దేవుడు ఇద్దరు తమలో ఎవరు గొప్ప అనే విషయం పై తీవ్ర వాదోపవాదాలు చేస్కుంటూ ఇద్దరు మేరు పర్వతం వద్దకు వచ్చి యుద్ధం కి సిద్ధపడ్డారట.
మహేశ్వరుడు..
ఆ యుద్ధం లో ఆది శేషుడు మేరు పర్వతాన్ని గట్టిగ పట్టుకోగా ,వాయు దేవుడు తన శక్తీ అంత ఉపయోగించి గట్టిగ మీరు పర్వతాన్ని ఉదాదట. వాయు దేవుడు శక్తీ ముందు ఏ శక్తీ పనికిరాదు కదా.. ఆలా వాయు దేవుని శక్తీ కి ఆ మీరు పర్వత శిఖరం 5 ముక్కలు గా విరిగి వేరు వేరు ప్రాంతాల్లో పడిందట. ఆలా ఈ కొదుమూడి లో వజ్రం తో సమానవైనా ఈ మీరు పర్వతం యొక్క శిఖర భాగం పది శివలింగ గా రూపు దిద్దుకుందట. ఆ తరువాతి కాలం లో మహేశ్వరుని లోక మాత పార్వతి దేవి తో వివాహం అయినా తర్వాత మొదటగా అగస్త్య మహా ముని కి ఇక్కడేయ్ దర్శనమిచ్చారట. అంతేకాకుండా ఈ ప్రదేశం లో నే శివ తాండవం చూసే అదృష్టం భరద్వాజ మహర్షి కి కలిగిందట.
శ్రీ మహా విష్ణువు..
ఈ ఆలయం లో శ్రీ మహా విష్ణువు(Lord Vishnu) ని ‘నారాయణ పెరుమాళ్’ అని అమ్మవారిని ‘ తిరుమంగ నాచియార్’ అని పిలుస్తారు అంటారు. వివాహం ఆలస్యం అయ్యేవారు ఇక్కడి ఆలయం లో పరిహార పూజలు చేసుకుంటే కచ్చితం వెంటనే వివాహం నిశ్చయం అవుతుందని భక్తులు నమ్ముతారట. దీని తో పాటు రాహుకేతు పరిహార పూజలు మరియు కుజ దోషం ఉన్న వారు కూడా పరిహార పూజలు చేస్కుంటారట. కాబ్బట్టి ఎలాంటి జాతక దోషాలు గ్రహ దోషాలు ఉన్న వారైనా ఇక్కడి ఆలయం లో పరిహార పూజలు చేసుకుంటే దోషాలు తొలగి మంచి ఫలితాలు అందుకోవచ్చని ఆలయ పండితులు చెబుతున్నారు.
బ్రహ్మ దేవుడు..
బ్రహ్మ దేవుడు(Lord Brahma) ఇక్కడ ఓ చెట్టు రూపం లో భక్తులకు దార్శనిమూస్తున్నారు. ఈ చెట్టు ని తమిళులు వాణ్ణి వృక్షం అంటారట. సుమారు 3000 ఏళ్ళ నాటి నుంచి ఈ మాహా వృక్షం ఆలయ ప్రాంగణం లో ఉందని ఆలయ కమిటీ వారు చెబుతున్నారు.ఈ వృక్షం ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ చెట్టు కి ఓ వైపు ముళ్ళు ఉంటాయి మరి వైపు ములు ఉండవు, ఈ చెట్టు కు ఎలాంటి పళ్ళు కాయవు పూలు కూడా పూయవట.ఈ చెట్టు కి మరో విశేషం ఉందటండీ అది ఏంటి అంటే ఈ వృక్షం యూక ఆ ఆకు ను ఓ బిందెడు నీటిలో ఉంచితే ఆ నీరు ఎంత కాలం అయినా పాడవకుండా మలినం కాకుండా ఉంటాయట. ఎంత విచిత్రమో కదా..!
మరెన్నో విశేషాలు..
ఈ ముగ్గురు త్రిమూర్తుల(Trinity Gods) తో పాటు ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంది ,కానీ ఎంతో విచిత్రం గా ఉంటుంది ఈ విగ్రహం కూడా. ఇక్కడి వినాయకుడి విగ్రహం సాధారణం గా ముఖ భాగం ఏనుగు మొఖం తో ఉంటూ పాదాలు మాత్రం పులి పంజా తో పోలి ఉంటుంది. ఇలా ఉండటం మనం ఎక్కడ చూసి ఉండము.
అంతేకాదు ఈ ఆలయం లో మరో విశేషం కూడా ఉంది ఈ ఆలయ ప్రాంగణం లో 3 తీర్ధాలు ఉన్నాయి అవి బ్రహ్మ తీర్థం, భరద్వాజ తీర్థం, దేవ తీర్థం. ఈ ఆలయం కావేరి నది ప్రక్కన విరాజిల్లుతోంది. ప్రతి ఏటా జరిగే ఈ ఆలయ బ్రహ్మొత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యా లో పాల్గొంటారని, భకత్తులే ఉత్సవమూర్తాల ను రధం పై తిరువీధుల్లో ఊరేగింపు తీసుకెళ్తారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. నవగ్రహ హోమం, నవగ్రహ శాంతి పూజల కు ఎంతో ప్రసిద్ధికంచినా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించాలి.