తమిళనాడులో సంచలన సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajinikanth) కు గవర్నర్ పదవి వరిస్తుందా? తమిళనాట మాత్రం ప్రస్తుతం ఈ ప్రచారం ఊపందుకుంది. రాజకీయాల్లోకి రజనీ రారని ఇప్పటికే క్లారిటీ ఉన్నా.. గవర్నర్ పదవిపై మాత్రం ఊహాగానాలు రేగుతున్నాయి.రజనీ ఇటీవల నటించిన జైలర్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం అభిమానులు ఆవిజయాన్ని ఆస్వాదిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈమూవీ వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
ధ్యానానికి వెళ్లినప్పటినుంచి పుకార్లు..
అయితే సినిమా విడుదలకు ముందే రజనీ కాంత్ హిమాలయాలకు వెళ్లారు. ప్రతీ ఏడాది లాగే ఈసారి ఒక గుహలో ధ్యానం చేశారు. ఆపై పవిత్ర బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. అక్కడనుంచి తిరిగి వచ్చే టప్పుడు ఆయన యూపీలో కొందరు రాజకీయ నేతలను కలిశారు.యూపీసీఎం యోగీ ఆదిత్య నాథ్, జార్ఖడ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ లను రజనీ కలుసుకున్నారు. యూపీముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ పాదాలకురజనీకాంత్ నమస్కరించారు. యోగులు వయసులో చిన్న వారైనా వారి కాళ్లకు నమస్కరించడం తనకుఅలవాటని అప్పట్లో రజనీ ఈ వివాదంపై వివరణ కూడా ఇచ్చారు. అక్కడనుంచి అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని చెన్నై వచ్చాక రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. మరోవైపు నిన్నచెన్నై లో ఓ.పన్నీర్ సెల్వన్ కూడా రజనీ కాంత్ ను కలుసుకున్నారు. . ఇలా వరుసగా ప్రముఖులు కలుస్తుండటం చూస్తుంటే రజనీకాంత్ విషయంలో బీజేపి పెద్దలు ఏదో నిర్ణయం తీసుకుంటున్నారేమోననే ఊహాగానాలు రేగాయి. ఆ టైమ్ లో గవర్నర్ పదవి ఇస్తారంటూ పుకార్లు రావడం సంచలనంగా మారింది.
సోదరుడు సత్యనారాయణ రావు క్లారిటీ!
దీనిపై రజనీసోదరుడు సత్యనారాయణ రావు వివరణ ఇచ్చారు. రాజనీకాంత్ రాజకీయాల్లోకి రారని, ఇక ఆయనకు గవర్నర్ పదవి రావడం అనేది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. వాస్తవానికి రజనీ ఏ రాజకీయ పదవులూ వద్దనుకుంటున్నారని కానీ పెద్దలు మరీ మొహమాట పెడితే కాదనరేమోననీ అన్నారు. మధురైలోబంధువుల వివాహాహానికి హాజరైన సత్యనారాయణ ఆ తర్వాత మీనాక్షీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
మీడియా ఆయన్నుచుట్టుముట్టడంతో పై విధంగా స్పందించారు.రజనీ సోదరుడే ఇలా స్పందించడంతో అభిమానులు మరో రెండడుగులు ముందుకేసీ రజనీకాంత్ కి గవర్నర్ పదవి ఖాయమనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు.దీంతో అసలు దుమారం మొదలైంది.
సినిమాలకు అందుకే గుడ్ బై ? (Rajinikanth)
ఇదిలా ఉండగా రజనీకాంత్ సోదరుడు ఈ రకంగా స్పందించడంతో ఈవిషయానికి మరింత ప్రచారం దొరికింది.రజనీకాంత్ మరికొన్నిసినిమాల తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై కొడతారని అంటున్నారు. అప్పటికి ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని అందుకే సినిమాలకు గుడ్ బై చెబుతారని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు.
రాజకీయాల్లోకి అడుగు పెట్టకుండానే గవర్నర్ పదవి చేపట్టాలన్నది రజనీకాంత్ అభిమతంగా కనిపిస్తోందని తమిళ పత్రికలు కోడై కూస్తున్నాయి.
మరి రజనీకాంత్ కు పదవి ఖాయమేనా? ఈ హంగామా అంతాచూస్తుంటే బీజేపి పెద్దలు తమిళనాట బిజేపి ఎదుగుదల కోసం రజనీకాంత్ ను ప్రసన్నంచేసుకుని గవర్నర్ గిరీ కట్టబెడతారేమోననే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే బీజేపీకి ప్రచారం కోసం సినీ తారలను పెద్దగా దింపుతున్న బీజేపి తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి నటులపై కన్నేసింది.