(G-20) తగ్గినట్లే తగ్గి మళ్లీ చెలరేగుతోంది కోవిడ్ వైరస్.. ఇప్పుడిప్పుడే మాస్క్ లేని ముఖాలు చూస్తున్న తరుణంలో మళ్లీ కోవిడ్ అన్న ఊహే సామాన్యులను భయపెడుతోంది. అమెరికాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్..అమెరికా ప్రధమ మహిళ, అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ మళ్లీ కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ఆమె డెలావర్ లో సొంతింట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే జో బైడెన్ కు టెస్ట్ చేయగా కోవిడ్ నెగటివ్ వచ్చిన ప్పటికీ ముందు జాగ్రత్తచర్యగా ఆయన కూడా ఐసోలేషన్ లోకి వెళ్లిపో యారు. బైడెన్ వయసు రీత్యా పెద్దవారు కావడంతో ఎప్పటి కప్పుడు నిపుణులైన వైద్య బృందం ఆయన్ను పరీక్షిస్తోంది.
డెలావర్ లో జిల్ బైడెన్
అంతకుముందు బైడెన్ దంపతులు ఫ్లోరిడాలోని హరికేన్ ఐడాలియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత డెలావర్ లోనే ఉన్న వారి బీచ్ హౌస్ కు బైడెన్ దంపతులు విశ్రాంతి కోసం వెళ్లారు.అయితే అక్కడే జిల్ బైడెన్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దాంతో ఆమె డెలావర్ లోనే ఉండిపోగా బైడెన్ మాత్రం ఫిలడెల్ఫియాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొని అక్కడనుంచి నేరుగా వైట్ హౌస్ కు చేరుకున్నారు.
జిల్ బైడెన్ కు గతేడాది కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
పైగా72 ఏళ్ల వయసు కావడం, అమెరికాలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగు తుండటం వల్ల ఆమెను ప్రత్యేక వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
బైడెన్ సదస్సుకు వస్తారా? (G-20)
భారత్ లో జరిగే జీ 20 సదస్సుకు ప్రపంచం నలుమూలలనుంచి దేశాధినేతలు రావాల్సి ఉంది. జో బైడెన్ కూడా ఈ సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.
దాంతో జోబైడెన్ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఆయనకు కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ అగ్ర దేశాధినేతలు పాల్గొనే సదస్సు కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో జో బైడెన్ కు కూడా ఎప్పటికప్పుడు టెస్ట్ లు చేస్తున్నారు.. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ బైడెన్ ప్రయాణం రద్దయినట్లు కానీ, వస్తున్నట్లు కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దాంతో బైడెన్ రాకపై సందిగ్ధత నెలకొంది.
జీ 20 సదస్సు లో ఏమేం చర్చిస్తారంటే (G-20)
ఈనెల 8నుంచి ఢిల్లీలో జరిగే ఈ దస్సుకు ప్రపంచం నలుమూలలనుంచి ఆర్ధికంగా సుస్థిర ప్రగతిని సాధించిన 20 దేశాలు ఈసదస్సులో పాల్గొంటుండగా ఆ దేశాల అధినేతలు వస్తున్నారు.
ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లపై ఇక్కడ చర్చ జరగడమే కాక, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన ఆర్థిక అవస రాలపైనా, డిజిటల్ ట్రాన్స్ పార్మేషన్, సుస్థిర ఆర్థిక విధానాలకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఆహార భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చలు జరుగుతాయి. జీ 20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈనెల7వ తేదీన వస్తారని షెడ్యూల్ చేసి ఉంది. శని, ఆదివారాలు భారత్ లోనే ఉండే బైడెన్ అనేక కీలక అంశాలపైనా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపైనా, మల్టీ లాటెరల్ డెవలప్ మెంట్ బ్యాంకుల ఏర్పాటు పైనా ప్రపంచ దేశాల నేతలతో చర్చలు జరుపుతారు.
ఎవరెవరు హాజరవుతారంటే..
అమెరికా అధ్యక్షుడితో పాటు బ్రిటన్, చైనా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా,ఫ్రాన్స్, సౌదీ అరేబియా,దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్,టర్కీ, అర్జెంటైనా, నైజీరియా,రష్యా, యూరోపియన్ యూనియన్ నేతలు, మెక్సికో, ఇటలీ, ఇండోనే షియా దేశాల అధినేతలు హాజరవనున్నారు.