బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ (SRK) తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నాడు. బాలీవుడ్ పాన్ ఇండియా మూవీగా భావిస్తున్న జవాన్ సినిమా విడుదలకు ముందు షారూక్ వెంకన్న దర్శనం చేసుకోవడం విశేషం. షారూక్ పట్టు బట్టలు ధరించి తన సినిమా బృందంతో పాటు శ్రీవారి గర్భాలయంలో ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.షారూక్ వెంట ఆయన కుమార్తె సుహానా, మేనేజర్ పూజా దాద్లాని కూడా ఉన్నారు. షారూక్ కుమార్తె సుహానా కూడా పట్టుబట్టలతోనే కనిపించింది.జవాన్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ తార నయన తార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్ తో కలసి వెంకన్న దర్శనం చేసుకున్నారు. ఈనెల 7న జవాన్ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యంలోనే షారూక్ బృందం శ్రీవారిని దర్శించుకుని మొక్కుకున్నట్లు సమాచారం.
ఆలయాల సందర్శనలో షారూక్ (SRK)
కొన్ని వారాల క్రితం షారూక్ (SRK) వైష్ణో దేవిని కూడా సందర్శించాడు.బ్లూ జాకెట్ ధరించి, ముఖాన్ని పూర్తిగా కవర్ చేసుకుని ఉన్న షారూక్ (SRK) ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైష్ణో దేవి ఆలయ బోర్డు అధికారులు, కొందరు పోలీసులు, షారూక్ వ్యక్తిగత సిబ్బంది వైష్ణో దేవి ఆలయ ప్రాంగణంలో ఉండగా తీసిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
వాస్తవానికి షారూక్ కొంత కాలంగా చాలా బిజీగా కనిపిస్తున్నాడు. గతవారం చెన్నై వెళ్లి జవాన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశాడు.
ఆ తర్వాత సినిమా ప్రమోషన్స కోసం దుబాయ్ వెళ్లాడు. ఆతర్వాత మళ్లీ ఇప్పుడు తిరుపతి వచ్చాడు.
షారూక్ ఖాన్ ఏ మూవీకి బహుశా ఇంతలా దైవదర్శనాలు,బిజీ ప్రమోషన్స్ చేయలేదేమో. బాహుబలి, ఆర్ ఆర్ఆర్ మూవీల తర్వాత పాన్ ఇండియా లేదా పాన్ వాల్డ్ మూవీ అంటే తెలుగు వాడు తీయాల్సిందే.. అదీ రాజమౌళి తీయాల్సిందేననే భావన ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులలో కలిగింది. టాలీవుడ్ ఇచ్చిన వరస హిట్లు బాలీవుడ్ వెలవెలబోయేలా చేశాయి. ఇప్పటికే సరైన హిట్ మూవీ లేక తమ డామినేషన్ ఎలా చూపించుకోవాలో తెలీక అల్లడుతున్న బాలీవుడ్ దానికోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.. ప్రమోషన్స్ పై శ్రద్ధ పెట్టడం, బడాబడా నిర్మాతలతో సినిమాలు తీయడం, భారీ బడ్జెట్ తో పెద్ద ఎత్తున మూవీ ప్రమోషన్స్ చేయడం ఇలా తమకు తెలిసిన అన్ని జిమ్మిక్కులూ చేస్తూనే ఉంది.. ఇప్పుడు జవాన్ మూవీ అయినా రికార్డులు సృష్టించాలనే పట్టుదలతో బాలీవుడ్ పెద్దలు కష్టపడుతున్నారు.
విడుదలకు సిద్ధంగా మరో మూవీ దుంకీ (SRK)
షారూక్ రాజ్ కుమార్ హిరానీ మూవీ దుంకీ లో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దీనికి సహనటి తాప్సీపన్ను.ఈ మూవీ కూడా డిసెంబర్22న రిలీజ్ కానుంది. సినిమాలో మేజర్ పోర్షన్ కశ్మీర్ లోనే షూటింగ్ జరిగింది. ఇమ్మిగ్రేషన్ కార్డు దొరకక సరిహద్దుల్లో ఇబ్బందులు పడే పంజాబీ యువకుడి కథాంశంగా తీసిన సినిమాయే దుంకీ.. సినిమా ప్రొడక్షన్ లోషారూక్ భార్య గౌరీఖాన్ కూడా ఉంది.