అభిమానుల ఉత్కంఠకు తెరదించుతూ వన్డే వాల్డ్ కప్ (World cup) భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే జట్టుపై భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
ముఖ్యంగా వన్డేల్లో ఎలాంటి రికార్డు లేని సూర్యకుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకొవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఆసియా లీగ్ మ్యాచ్ లు ఆడని కేఎల్ రాహుల్ ను సెలక్టు చేయడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. రాహుల్ కు బదులు సంజు శాంసన్ ను తీసుకుని ఉంటే బాగుండేదని నెటిజన్ లు అభిప్రాయపడుతున్నారు.
అయితే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ల ఫిట్ నెస్ మీద కూడా అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో రెస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ కి తీవ్ర గాయమేఅని చెపాలి. అయితే నెల కిందటే ఫిట్ నెస్ సాధించినట్లు వార్తలు వచ్చాయి. రాహుల్ గత కొంతకాలంగా ఫామ్ లో లేడు. గాయం నుంచి కోలుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై చాలా అనుమానాలు ఉన్నాయి. పెద్ద టీమ్స్ తో జరిగే మ్యాచ్ ల్లో విఫలం అవుతాడనే చెడ్డ పేరు కూడా ఉంది. అలాగే అశ్విన్ కి కూడా మ్యాచ్ విన్నర్ గా పేరుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడే ప్లేయర్. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో ఆడగలడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కూడా చేయగలడు. శార్దుల్ ఠాకూర్ తో పోలిస్తే చాలా అనుభవం ఉన్న ప్లేయర్. భారత పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. అటువంటి సందర్భంలో అశ్విన్ కు ప్రపంచకప్ లో చోటు ఇచ్చి ఉండాల్సింది.
డకౌట్ స్టార్ ఎందుకని ప్రశ్నల
అంతర్జాతీయ పోటీల్లో పెద్దగా అనుభవం లేని సూర్య కుమార్ ను జట్టులోకి ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ కెరీర్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 26 వన్డేలు ఆడి 511 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక స్కోరు 64. అంతేకాకుండా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన మూడు వన్డేల సిరీస్లో వరుసగా హ్యాట్రిక్ డకౌట్లను సాధించాడు.
దీంతో ప్రపంచకప్ జట్టులో డకౌట్ స్టార్ అవసరమా అని సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెట్ అభిమానులు బీసీసీఐ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అదే విధంగా మణికట్టు స్పిన్నర్ చాహల్ కి ప్రపంచకప్ లో జట్టులో చోట్టు దక్కలేదు. ఈ విషయంపై స్పందించిన మాజీ ఆఫ్ స్పినర్ హర్భజన్ సింగ్ జట్టులో యుజువేంద్ర చాహల్ కు చోటు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ లో అతడి బౌలింగ్ గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది మ్యాచ్ ని ఎలాంటి సమయంలో అయిన మ్యాచ్ ను విజయం వైపుకు తిప్పగలడు అని హర్బజన్ ట్వీట్ చేశాడు.
తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలకు నో ఛాన్స్ (World cup)
ఇక అందరూ ఊహించినట్లుగానే పేసర్ ప్రసిధ్ కృష్ణతో పాటు తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. అయితే వన్డే వరల్డ్ కప్లో కీలకమైన నాలుగో నెంబర్ కోసం.. భారత్ ఎదురు చుస్తున్నా సమయంలో యువ ఆటగాడు, మన తెలుగు వాడు తన ఆటతో ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాడు. అది కూడా కీలకమైన మిడిల్ ఆర్డర్లో తన ఆటతో అందరిని అకట్టుకున్నాడు.. ఐపీఎల్లో సత్తాచాటి ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ 20 ఏళ్ల యంగ్ ప్లేయర్.. తనదైన హిట్టింగ్తో చేలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు నాలుగో స్థానం కోసం పరిశీలించిన ఇతర ఆటగాళ్లతో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి.. జట్టును ఆదుకోవడం పట్ల దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు పొందాడు. అయితే ప్రపంచకప్ లో కూడా చోటు కల్పించి ఉంటే బాగుండేదన్నది మరో అభిప్రాయం.
ఇకనుంచి భారత్ అని ఉన్న జెర్శీనే ధరించాల్సి ఉంటుందా? (World cup)
1996లో నెదర్లాండ్స్ ప్రపంచకప్ ఆడేందుకు హాలెండ్ అనే పేరుతో భారత్ కు వచ్చింది. అయితే 2003 లో తలపడినప్పుడు నెదర్లాండ్స్ గా మార్చుకుంది. మరో దేశం బర్మా కూడా మయన్మార్ గా మార్చుకుంది.ఇలాగే ఎంతో మంది తమ తమ దేశాల పేర్లను మార్చుకున్నారు. ఇక జీ2- సదస్సు పుణ్యమాని మన దేశం పేరును భారత్ అని మారుస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగంలో భారత్, ఇండియా రెండు పేర్లు ఉన్నప్పటికీ భారత్ అనిదేశం పేరు మార్చే ఉద్దేశాలతో కేంద్రం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈనేపధ్యంలోనే మాజీక్రికెటర్ వీరేంద్రసెహ్వాగ్ కొంచెం అడ్వాన్స్ అయ్యాడు.టీమ్ ఇండియాకాదు ఇకపై టీమ్ భారత్ అంటున్నడు.మన ఆటగాళ్లంతా టీమ్ భారత్ అని రాసి ఉన్నజెర్సీలను వాల్డ్ కప్ లో ధరించేలా బీసీసీఐ చర్యలు తీసుకోవాలనికోరాడు.