(sanatana)
సనాతనధర్మంపై అటు బీజేపి, ఇటు లెప్టిస్టు భావజాల వాదుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇది అదుపు తప్పే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రధాని మోడీ దీనిపై ఆచితూచి మాట్లాడాలంటూ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు.
దీనిపై అతిగా స్పందించకండి.. అదే సమయంలో ఉదయనిథి స్టాలిన్ కామెంట్లను మాత్ర గట్టిగాతిప్పికొట్టండి. సనాతన ధర్మానికి సంబంధించినంత వరకూ ఆ సబ్జెక్ పై అవగాహనఉండి దానినిసమర్ధించే వారు వారిపని వారు చేస్తారు. చరిత్రలోతుల్లోకి వెళ్లకండి. రాజ్యాంగం ప్రకారమే వాస్తవాలకు కట్టుబడి మాట్లాడండి. వివాదాస్పదమైన వ్యాఖ్యలకు దూరంగా ఉండండి అని ప్రధాని కోరారు. అంటే ఈవిషయంపై బీజేపి స్పష్టమైన విధానంతోనూ, వ్యూహంతోనే ముందుకెళుతోందని అర్ధమవుతోంది.
కొనసాగుతున్న ఉదయనిధి వ్యాఖ్యల వేడి… (sanatana)
సనాతన (sanatana) ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలవేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈవాదం వివాదంగా మారి చివరకు తలలు తీసేస్తాం అనే సవాళ్ల దాకా వెళ్లింది. సనాతన వాదాన్ని వదిలేయడమంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వదిలేయడమేనంటూ సనాతన వాదులు తిరగబడ్డారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన దేశ సంస్కృతిని నాశనం చేసే కుట్ర ఇది అంటూ హిందూధర్మాన్ని సమర్ధించే వారు గట్టిగానే స్పందించారు. దీనికి కవ్వింపుగా తన తలను తీసేందుకు పదికోట్లు అవసరం లేదని, తాను తల దువ్వుకోడానికి పదిరూపాయల దువ్వెన చాలనీ వ్యంగ్యంగా రిటార్ట్ ఇచ్చారు.
మన మూలాల్లోనే సనాతన వాదం… (sanatana)
నిజానికి మన దేశమే సనాతన వాద మూలాలతో నిర్మితమయ్యింది. దేవుడిని నమ్మే ఆచారం మన వందల,వేల,ఏళ్ల క్రితమే మన దేశంలో ఉంది.
వామపక్షవాదమైనా,నాస్తిక వాదమైనా ఆ తర్వాత పుట్టుకొచ్చినవే. విగ్రహారాధనకు, దేవుడి పూజకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పుకునే డీఎంకే ది అంతా బిల్డప్పే.. సనాతన ధర్మాన్నికూకటి వేళ్లతో పెకలించాలని ప్రకటన ఇచ్చిన కరుణానిధి మనవడు ఉదయ నిధి స్టాలిన్ ముందు తన వంశ చరిత్ర తెలుసుకోవాలి. డీఎంకే అధినేత కరుణానిధి జీవితకాలం నాస్తికవాదిగానే ముద్ర పడినా.. ఆయన కుమార్తె కనిమొళి 2జి స్పెక్ట్రమ్ స్కామ్ లో జైలుకెళ్లినప్పుడు ఆ కుటుంబం అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు.. ఆకుటుంబం తమిళనాడులో తిరిగినన్నిఆలయాలు లేవు.. మొక్కని దేవుళ్లూ లేరు. కనిమొళి జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ పూజలు, హోమాలు చేయించిన చరిత్ర ఉంది.
ఇంకా వెనకటికి వెళితే సనాతన ధర్మ ప్రతినిధి అయిన పుట్టపర్తి సత్య సాయిబాబాను కరుణానిధి సన్మానించారు. తమిళనాడులో పుట్టపర్తి ట్రస్ట్ చేపట్టిన ధార్మిక కార్యక్రమాల వల్ల ఆ రాష్ట్రానికి ఆర్దికంగా ఎంతో సహాయం అందింది.అందుకు కృతజ్నత గానే అప్పట్లో కరుణానిధి సత్యసాయిబాబాకు ప్రణమిల్లారు. పుట్టపర్తి వచ్చి స్వామి సేవలో తరించారు.పుట్టపర్తి ప్రశాంత నిలయంలో కొన్ని రోజులు ఉన్నారు. అప్పుడు సత్యసాయిబాబ వారికి గాల్లోంచి మంత్రించిన ఉంగరాలను తీసి ఇచ్చినట్లు చెబుతుంటారు.
ఆ తర్వాత సాయిబాబాను తమిళనాడుకు ఆహ్వానించి ఘనంగా సత్కరించారు కూడా.సత్యసాయిబాబా పక్కా హిందూ ధర్మ పరిరక్షకుడు.. ఆయన దేవుడిని కొలవమనే చెప్పాడు. అలాంటి సత్యసాయిని కరుణానిధి సత్కరించారు. సనాతన ధర్మ ప్రతినిధిని సత్కరించడమంటే ఆ వాదాన్ని సమర్ధించడమే..నాస్తికవాదాన్ని సమర్ధిస్తున్న డీఎంకే అందరికన్నా ఎక్కువగా దేవుళ్లను నమ్మే తమిళనాడు ప్రజలను ఏలుతోంది.తమిళనాడులో ఉన్నన్ని ఆలయాలు, ధార్మిక సంస్థలు అసలు దేశంలోనే మరెక్కడా లేవంటే ఆశ్చర్యం లేదు.అలాంటి తమిళనాడును ఏలుతున్న డీఎంకే పార్టీ సనాతన వాదంపై ఎందుకిలాంటి దుందుడుకు వ్యాఖ్యలు చేసిందన్నదే ఇప్పుడు ప్రశ్న.నాస్తికవాదులందరూ ఒకప్పుడు ఆస్తికవాదులే.. జీవిత చరమాంకంలో ఆస్తికులుగా మారారన్నది చరిత్ర చెప్పిన సత్యం.
దేహం ఉన్నన్నాళ్లు.. ఓపిక ఉన్నన్నాళ్లూ దేవుడు లేడు, దెయ్యమూ లేదు అంతా మిధ్య అనుకున్న వారంతా ప్రాణాలు కొడిగట్టిపోతున్నప్పుడు, తీవ్రమైన అనారోగ్యం వేధించి కష్టాలు కమ్మేసినప్పుడు ఆ కనిపించని దేవుడినే ఎక్కడున్నావు నాయనా అని కోపంగానైనా తలచుకునే పరిస్థితులు చూశాం.. చూస్తున్నాం..
ఈపాటి దానికి ఎందుకింత రగడ? ఏ వాదమైనా మరొకరి స్వేచ్ఛను, సమగ్రతను ప్రశ్నించనంత కాలం, శంకించనంత కాలం గొడవలు రావు.. కోరి గొడవలు తెచ్చుకోవాలనుకుంటే ఇదుగో స్టాలిన్ లా ఏదో ఒక తుట్టను కదపాలి.ఆధ్యాత్మిక పునాదులు .. ఘన చరత్ర, వారసత్వం కలిగిన మన దేశంలోకి ఏ వాదం వచ్చినా అది మధ్యలో వచ్చినదేనని చరిత్ర చెబుతోంది.
మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసి ఉదయనిధి ఏం బావుకోవాలనుకున్నాడో మరి..