శ్రీ మహా విష్ణువు ని దశావతారాలలో శ్రీ కృష్ణుడు(Sri Krishna) ఎనిమిదవ అవతారం గా ద్వాపరయుగం లో ధర్మ సంస్థాపన కై మానవ రూపం లో అవతరించినట్టు పూరణలు చెబుతున్నాయి. శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవుల కుమారుడు. దేవకీ సోదరుడు శ్రీ కృష్ణుని మేన మామ అయినా కంసుడు శ్రీ కృష్ణుని సంహరించాలనుకున్నాడు ఎందుకంటే దేవకీ వసుదేవుల కు ఎనిమిదవ సంతానంగా పుట్టే వారు కంసుని మరణానికి కారణం అవుతారని ఆకాశవాణి కంసునిహెచ్చరిస్తుంది. దాని తో కంసుడు ప్రాణ భీతి తో దేవకీ వసుదేవుల ఎనిమదవ సంతనాన్నే కాదు మొదటి నుంచి పుట్టిన శిశువులందరిని పుట్టిన వారిని పుట్టినట్టే సంహరించాడు. దేవకీ వసుదేవుల తమ సంతానాన్ని పొగగొట్టుకోవడం తో చాలా బాధ పడేవారు.కానీ కృష్ణుని చంపాడని కంసుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఈ క్రమం లో నే కృష్ణుని శరీర ఛాయ నీలం గా మారిందని మరికొందరు చెబుతున్నారు.నిజానికి ఇదే ఒక్కటే కారణం కాదట ఇలా నీలం గ మారడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయట.
నీల మేఘశ్యాముని వెనుక కధనాలు..
దేవకీ వసుదేవుల వద్ద శ్రీ కృష్ణుడు(Sri Krishna) ఉన్నప్పుడు కంసుడు సంహరించాడు అనుకోని ఆనందం లో ఉన్నాడు కానీ కొన్ని కారణాల వలన అతను చంపలేకపోయాడు.చిన్ని కృష్ణుని కంసుని బారి నుంచి తపించడానికి వాసుదేవుడు శ్రీ కృష్ణుడిని(Sri Krishna) రేపల్లె లో ని యశోద నందుని ఇంటి చేరుస్తాడు. కానీ కృష్ణుని లీలలు ఏ ఒక్క ప్రదేశానికి పరిమితం కాదు కాబ్బటి ఆ కృష్ణ లీలల ఆ నోటా ఈ నోటా పది చివరికి కంసుని దాకా వెళ్ళింది. ఇన్ని లీలలు ఇంత బాలుడు కి ఎట్లా సాధ్యమని సందేహించిన కంసుడు తన మరణానికి కారణమాయె దేవకి వసుదేవుల కుమారుడే ఈ బాలుడు అని అనుమానం తో పూతన అనే రాక్షస స్త్రీ ని పంపించాడట.
పూతన కపట నాటకం తో యశోద ను నమ్మించి కృష్ణుడికి పక్కకు తీస్కువచ్చి పాలు తా గించిందట .పాలు అంటే కృష్ణునికి(Sri Krishna) ఇష్టం కాబ్బటి బాలుడయిన కృష్ణునికి సులువుగా తాగించవచ్చు అనుకునింది. ఆ పాలు విష పూరితమయిన వి అయినా,పూతన బుద్ధి తెలిసి కూడా కృష్ణ భగవానుడు ఆ విషపూరితమయిన తాగుడు. కానీ ఆ విషం కృష్ణుని పై ఎలాంటి ప్రభావం చూపించలేదట అంతేకాకుండా ఆ పూతన ను కూడా ఆ స్వామి వారు సంహరించారట.కానీ ఆ విష ప్రభావం వాళ్ళ కూడా కృష్ణుని శరీరం నీలం గా మారి ఉంటుందని అని పండితులు చెబుతున్నారు.
మరో కధనం..
శ్రీ కృష్ణుడు నీలో రంగు ఛాయా లో ఉండటానికి మరో కధనం కూడా ఉందట. పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు(Sri Krishna) యమునా నది ఒడ్డున ఉన్న రేపల్లె లో నివసించేటప్పుడు ఓ రోజు గోపికలతో ఆడుకుంటూ ఉండగా వారి బంతి యమునా నది లో పడిపోయిందట.గోపికలు నది లో కి వెళ్లి బంతి తీసుకురావడానికి భయపడ్డారట దానితో శ్రీ కృష్ణుడు బంతి కోసం యమునా నది లో కి వెళ్ళాడట. అప్పుడు కాళియుడు అనే రాక్షసుడు ఆ నది లో ఉన్నాడట.కాళియుడు ఆ నది లో ఉనందున యమునా నది నీరంతా విషపూరితామై నీలి రంగు లో కి మారిపోయిందట.ఆ సమయం లో కాళియుడు తో శ్రీ కృష్ణుడు(Sri Krishna) యుద్ధం చేసి యమునా నది నీటి ని తిరిగి మంచి నీటి మార్చాడట. ఆ యమునా నీటి ప్రభావం తో శ్రీ కృష్ణుని శరీరం నీలం గా మారిందని ఓ కధనం కూడా ఉందట. ఇలా శ్రీ కృష్ణునికి నీల మేఘశ్యాముడు అనే పేరు వచ్చింది