5
రోడ్డు ప్రమాదాలు ఒక్కోసారి చాలా విచిత్రంగా జరుగుతుంటాయ్. ఒక ప్రమాదం మరో ప్రమాదానికి, ఆ ప్రమాదం మరో ప్రమాదానికి దారి తీస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయ్. ఒక యాక్సిడెంట్ స్పాట్ లో దెబ్బ తిన్నలారీని స్పీడ్ గా వచ్చిన కారు గుద్దేసింది. ఆపై అదే కారును దాని వెనకే వచ్చిన బైక్ ఢీకొంది. ఇలా సెకన్ల వ్యవధిలో జరిగిన ఈప్రమాదం ఐదు నిండు ప్రాణాలను బలిగొనగా,అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ 5
చిత్తూరుజిల్లా వడమాల పేట జాతీయ రహదారి చెక్ పోస్ట్ దగ్గర ధర్మాపురం రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చూపరులను దిగ్భ్రాంతికి గురి చేసింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణా చర్యలు చేపట్టేందుకు మార్కింగ్ చేస్తున్నటైమ్ లోనే ఈ ఘోర ప్రమాదం జరగడం విషాదం. వివరాల్లోకి వెళితే.. వడమాల పేట చెక్ పోస్ట్ దగ్గర ఓలారీ ఆగి ఉంది.. చెక్ పోస్ట్ దగ్గర కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్ వేస్తున్నారు. దీనికోసం జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకి చెందిన మార్కింగ్ వాహనాన్ని నిలిపి ఉంచారు. రోడ్డు మార్జిన్లు గుర్తించేందుకు వీలుగా వైట్ పెయింటింగ్ లను అధికారులు గుర్తిస్తున్నారు.
మరోవైపు అదే రహదారిలో చిన్నచిన్న ఫినిషింగ్ పనులు ఉండటంతో కూలీలు పని చేసుకుంటున్నారు. తమకు కావాల్సిన సామాగ్రిని ఒకలారీలో ఉంచి ఆ లారీని రోడ్డు పక్కన ఉంచి కూలీలు పనులు చేస్తున్నారు. సరిగ్గా అదే టైమ్ లో మితిమీరినవేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దాంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా చెల్లా చెదురుగా పడిపోయింది. ఇదే రూట్ లో మరో కారు చాలా స్పీడ్ గా వస్తూ కంట్రోల్ కాక లారీని ఢీకొంది. దాంతో కారులో ఉన్న ప్రయాణికులు ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ టైమ్ లోనే కారు వెనకే వాయువేగంతో వస్తున్నబైక్ కూడా కారును ఢీకొంది. దాంతో బైక్ పై తండ్రి ముగ్గురు పిల్లలు ప్రయాణిస్తున్నారు… వీరిలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. 5
రెప్పపాటులోనే ఘోరం… 5
ఈ ఘోర రోడ్డు ప్రమాదం అంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. వెంట వెంటనే రెప్ప పాటులో జరిగిన ఈ మూడు యాక్సిడెంట్లను చూసి స్థానికుల నోట మాట రాలేదు. ఈ వరుస యాక్సిడెంట్లలో మొత్తం ఐదుగురు చనిపోగా, మరో 8మందకి తీవ్రగాయాలయ్యాయి.కారులోని ఇద్దరు,బైక్ పైన ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు ప్రమాద స్థలిలోనే ప్రాణాలొదిలారు. ఏ పాపమూ ఎరుగని రోడ్డునిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి..
అతివేగం.. నిర్లక్ష్యం ఫలితమే యాక్సిడెంట్లు
అతివేగమే ఈ ప్రమాదాలన్నింటికి మూలకారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.పైగా డ్రైవింగ్ నిబంధనలను అతిక్రమిస్తూ నలుగురు ఒకే బైక్ పై వేగంగా ప్రయాణించి యాక్సిడెంట్ స్పాట్ లో ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన కారును ఢీకొనడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట.ఈ ఘోర రోడ్డు ప్రమాదం వల్ల తిరుపతి,చెన్నై రూట్ లో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించింది.